Monday 29 December 2014

మతాల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎంలపై ఉంది శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి

మతాల అస్తిత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత సీఎంలపై ఉంది
శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి
కామారెడ్డి, డిసెంబర్‌ 29: మతాల అస్తిత్వాన్ని, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సీఎంలపై ఉందని శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి అన్నారు. సోమవారం నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్వలాభం, రాజకీయాల కోసం మతాలను కలుషితం చేయకూడదన్నారు. మతాలకు అతీతంగా ప్రభుత్వాలు వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రల ముఖ్యమంత్రులు హిందు వుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. దీనిని హిందూ సమాజం ఒప్పుకోదన్నారు. క్రైస్తవులు, మైనార్టీల కోసం ప్రత్యేక పథకాలు, రిజర్వేషన్లు కల్పించడం తగదన్నారు.

No comments:

Post a Comment