Friday 29 January 2016

'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు'

జర్నలిస్టులకు ఉచితంగా ఇళ్లు 
30-01-2016 02:28:28

  • పేదల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల కన్నా అదనంగా నిధులు
  • హౌసింగ్‌ సొసైటీల రద్దుకు జర్నలిస్టులు అంగీకారం
  • పాత్రికేయ బృందంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌
హైదరాబాద్‌, జనవరి29(ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని జర్నలిస్టులందరికీ పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో ఇండ్లు కట్టించి ఇవ్వాలని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రతి జర్నలిస్టుకు సొంతిల్లు ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమని, సమాజ హితం కోసం పనిచేసే జర్నలిస్టుల కుటుంబాలకు, పిల్లలకు ఇల్లు రూపంలో ఓ ఆస్తి మిగలాలనేది తమ ఉద్దేశమని సీఎం చెప్పారు. బ్యూరో, డెస్క్‌, వీడియో లాంటి విభాగాలన్నింటికి సంబంధించిన జర్నలిస్టులకు అన్ని సౌకర్యాలతో కూడిన ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. జర్నలిస్టులందరికీ ఒకేచోట ఇండ్లు నిర్మించడానికి దాదాపు వంద ఎకరాల స్థలం కేటాయిస్తామని, పేదల కోసం కట్టే డబుల్‌ బెడ్‌రూముకిచ్చే దానికి అదనంగా నిధులు వెచ్చిస్తామన్నారు. గేటెడ్‌ కమ్యునిటీలో రెసిడెన్షియల్‌ టవర్లు, క్లబ్‌హౌజ్‌, మార్కెట్‌, స్కూల్‌, ప్లే గ్రౌండ్‌, పార్కు, మల్టీప్లెక్సు ఉండేలా అద్భుతమైన న్యూటౌన నిర్మిస్తామని వెల్లడించారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన అల్లం నారాయణ సీనియర్‌ జర్నలిస్టులు శ్రీనివాస్‌ రెడ్డి, దేవులపల్లి అమర్‌, క్రాంతి, పల్లె రవికుమార్‌, విరాహత అలీ, శైలే్‌షరెడ్డి, బుద్దా మురళి, పీవీ శ్రీనివాస్‌, వి సతీష్‌, వై నాగేశ్వర్‌రావు, చైతన్య వర్మ, రమేష్‌ హజారి, ప్రకాశ్, వెంకటాచారి, బసవపున్నయ్య తదితరులు శుక్రవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు.
 
ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన హామీ మేరకు జర్నలిస్టులకు ఇండ్లు కట్టించి ఇవ్వడానికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేశారు. జర్నలిస్టు టౌన్‌షిప్ కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్, మెదక్‌ జిల్లా కలెక్టర్‌ రోనాల్డ్‌ రాస్‌, టిఎస్‌ ఐఐసి ఎండీ నర్సింహారెడ్డిని సీఎం ఆదేశించారు. అధికారులు, జర్నలిస్టు నాయకులు శనివారం నగరంలో పర్యటించి అనువైన స్థలాన్ని ఎంపిక చేసుకోవాలని కోరారు. స్థలం ఎంపిక చేసుకున్న వెంటనే మంచి లేఅవుట్‌ రూపొందించి మార్చిలోనే శంకుస్థాపన చేసి, ఏడాదిలోగా ఇండ్ల నిర్మాణం పూర్తిచేయాలనేది తన ఆలోచన అని సీఎం వెల్లడించారు. సీఎం స్వయంగా ఇండ్ల నిర్మాణానికి ముందుకు వచ్చిన నేపథ్యంలో, జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం గతంలో ఏర్పడిన సొసైటీలను రద్దు చేసుకోవడానికి జర్నలిస్టుల సంఘాల నాయకులు అంగీకరించారు. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో మెదటి విడతలో టౌన్‌షిప్లు నిర్మిస్తామని, దశలవారీగా అన్ని జిల్లా కేంద్రాల్లో జర్నలిస్టుల కోసం రెసిడెన్షియల్‌ టవర్లు ఏర్పాటు చేస్తామని సీఎం ప్రకటించారు.


'జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు'

Sakshi | Updated: January 30, 2016 05:02 (IST)
హైదరాబాద్‌: హైదరాబాద్ లో జర్నలిస్టులకు వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఇళ్లు కట్టిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ ఇచ్చారు. వంద ఎకరాల గేటెడ్‌ కమ్యూనిటీలో జర్నలిస్టులకు ఇళ్లు కట్టిస్తామని చెప్పారు. శుక్రవారం జర్నలిస్టు సంఘాల నేతలతో ఆయన భేటీ అయ్యారు.

ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. రేపు(శనివారం) ఇళ్ల స్థలాలకు అనువైన స్థలం అధికారులు ఎంపిక చేయనున్నట్టు పేర్కొన్నారు. మార్చిలో జర్నలిస్టుల ఇళ్లకు శంకుస్థాపన చేసి.. ఏడాదిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

No comments:

Post a Comment