Wednesday 15 April 2015

కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం


గుంటూరు, ఏప్రిల్‌ 15: జిల్లాలోని కాకుమాను గ్రామంలో కుక్కలు వీరంగం సృష్టించాయి. బుధవారం నాడు గ్రామంలో షేక్‌ కౌషర(6) అనే బాలిక ఇంటి ముందు ఆడుకుంటుండుగా 10 కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన కౌషర అక్కడికక్కడే మృతిచెందింది. మరోవైపు గ్రామంలో పిచ్చికుక్కలు స్వైర విహానం చేస్తుండడంతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు.

No comments:

Post a Comment