Monday 20 April 2015

‘అణువిద్యుత్‌’కు అనుకూలమే!

‘అణువిద్యుత్‌’కు అనుకూలమే!

  • నిర్వాసితుల్లో అవగాహనకు కొవ్వాడలో కలెక్టర్‌ పర్యటన
శ్రీకాకుళం, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ తీరంలో అణువిద్యుత్‌ కర్మాగార ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు కన్పిస్తున్నాయి. సోమవారం కలెక్టర్‌ పి.లక్ష్మీనృసింహం, ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు నిర్వాసిత గ్రామాల్లో పర్యటించి అవగాహన కల్పించారు. చినకొవ్వాడ, పెదకొవ్వాడ, రామచంద్రపురం, గూడేం గ్రామస్థులు కూడా అవగాహన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశంలోనే 10వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేసే ‘అణు’ కేంద్రాలు ఇంతవరకు లేవని, ఇదే మొదటిదని చెప్పారు. ఎమ్మెల్యే కిమిడి కళావెంకట్రావు మాట్లాడుతూ, ఎటువంటి డిమాండ్లు ఉన్నా తమతోపాటు అధికారుల దృష్టికి తీసుకు రావాలని సూచించారు.

No comments:

Post a Comment