Wednesday 29 April 2015

భూసేకరణ చట్టంలో సవరణలు సహేతుకమే - పి.సుగుణాకర్‌రావు

ఆ సవరణలు సహేతుకమే

Sakshi | Updated: April 29, 2015 02:10 (IST)
ఆ సవరణలు సహేతుకమే
పి.సుగుణాకర్‌రావు

 యూపీఏ పాలనలో పేదల భూములను సేకరించి తక్కువ ధరలకే బడా పారిశ్రామికవేత్తలకు కట్టబెట్టాలని చూశారు.

 నరేంద్ర మోదీ నాయకత్వం లోని ఎన్డీయే ప్రభుత్వం 2013, భూసేకరణ చట్టంలో తీసుకురాదలచిన మార్పులు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. 2013 న్యాయమైన పరిహార హక్కు, పారదర్శక భూసేకరణ, పునరావాసం, పునర్‌నివాస చట్టం జనవరి 1, 2014 నుంచి అమలులోకి వచ్చింది. నిజానికి దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచినా బ్రిటిష్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 1894 భూసేకరణ చట్టాన్నే ఇంతకాలం అమలు చేసుకున్నాం. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి పరిశీలిస్తే- ఆనకట్టలు, కాల్వలు, విద్యుదు త్పత్తి కేంద్రాలు, రైల్వేలు, విమానాశ్రయాలు, మౌలిక సదుపాయాల కల్పన, గని పనుల కారణంగా దాదాపు రెండున్నర కోట్ల మంది దేశంలో భూనిర్వాసితులుగా మిగిలారు. న్యాయస్థానాలలో జాప్యం, నిధుల లోటు, పరిహారాల చెల్లింపులో జాప్యం వంటి కారణాలతో చాలామంది నష్టపోయారు కూడా. కానీ ప్రజా అవస రాలు అనే కారణంతో ఇలాంటివారి అభ్యర్థనలు ప్రభు త్వాలను కదిలించలేక పోయాయి. నిజానికి ప్రజా ప్రయోజనాలకే భూసేకరణ అనే అంశం మీద గతంలో ప్రజలలో విశ్వాసం ఉండేది.

 యూపీఏ హయాంలో, మన్మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరిట (సెజ్‌లు) జరిగిన భూసేకరణ భూదురాక్రమణగా మారింది. అవసరమైన దానికంటే ఎక్కువ మొత్తంలో ప్రైవేటు సంస్థల కోసం సేకరించి ప్రజలకు అన్యాయం చేశారన్న విమర్శ ఉంది. రైతాంగంలో ఇది మరీ బలంగా ఉన్న భావన. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్ భూసేకరణ మీద ప్రజలు యుద్ధం ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా లోని సోంపేట, కాకరపల్లిలలో విద్యుదుత్పాదక సంస్థ కోసం భూసేకరణ చేయాలని నిర్ణయించినప్పుడు కూడా పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. ఐదుగురు మరణించారు. 2008లో పశ్చిమ బెంగాల్‌లో టాటా నానో కార్ల కర్మాగారం ఏర్పాటు ప్రయత్నాన్ని కూడా ప్రజలు అడ్డుకున్నారు. యూపీఏ పాలనలో పేదల భూములను సేకరించి తక్కువ ధరలకే బడా పారిశ్రామి కవేత్తలకు కట్టబెట్టాలని చూశారు. దీనితోనే భూసేకరణ అంటే, పేదల భూములను లాక్కుని పెద్ద పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడమనే అభిప్రాయానికి ప్రజలు రావల సివచ్చింది. నిజానికి 2013 చట్టాన్ని ఎన్నికలకు ముందు కొన్ని ప్రయోజనాలను సాధించుకోవడానికి యూపీఏ తెచ్చింది. అందులో రైతు సంక్షేమం లేదు.

 2013 చట్టం ప్రకారం స్థానిక సంస్థలు, గ్రామస భల అనుమతులతో  భూసేకరణ జరగాలి. భూయజ మానులతో పాటు వ్యవసాయ కూలీల, చేతివృత్తుల, కౌలుదారుల ప్రయోజనాలకు అది ప్రాధాన్యం ఇచ్చింది. భూసేకరణతో సామాజికంగా జరిగే ప్రభావం గురించి కూడా నిపుణులతో అంచనా వేయించాలి. గ్రామీణ ప్రాంతంలో అయితే మార్కెట్ ధరకు నాలుగు రెట్లు, పట్టణ ప్రాంతంలో రెండు రెట్లు పరిహారం పొందే హక్కును కూడా ఈ చట్టం కల్పించింది. పునరావాసా నికి, మౌలిక వసతుల కల్పనకు కూడా ఆ చట్టం ప్రాధా న్యం ఇచ్చింది. కానీ ప్రభుత్వం యాజమాన్య హక్కు కలి గి ఉండి ప్రైవేటు పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలంటే 80 శాతం నిర్వాసితుల సమ్మతి; ప్రభుత్వ-ప్రైవేటు ఉమ్మడి భాగస్వామ్యంలో నెలకొల్పదలచిన ప్రాజెక్టుల కైతే 70 శాతం నిర్వాసితుల సమ్మతి ఉన్నప్పుడే భూసే కరణ జరపాలనే నిబంధన కూడా ఆ చట్టంలో ఉంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన కాలానికి మోదీ అధికారం చేపట్టారు.

 జాతీయ రహదారులు, రైల్వేలు, అణుశక్తి, విద్యు దుత్పాదన వంటి పదమూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజె క్టులు 2013 భూసేకరణ చట్టం పరిధిలో చేరవు. అందు వల్ల ఆ అంశాల ఆధారంగా సేకరించే భూములకు ఈ చట్టం ద్వారా నష్ట పరిహారం చెల్లింపు సాధ్యం కాదు. కాబట్టి ఆ పదమూడు అంశాలను 2015 నాటి సవరణ ద్వారా అదే చట్టం పరిధిలోకి తీసుకువచ్చారు. అలాగే  నీటి పారుదల, విద్యుదుత్పాదన, భూగర్భగనులు, పారి శ్రామిక వాడల నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టుల పని కేవలం ఐదేళ్లలో పూర్తి చేయడం సాధ్యం కాదు కాబట్టి, అలాంటి ప్రాజెక్టులకు పట్టే కాలపరిమితిని కూడా ఈ చట్టం పరిగణనలోనికి తీసుకుంది. నిజానికి భూయ జమాని సమ్మతి లేని కారణంగా దాదాపు 300 బిలియన్ కోట్ల విలువైన ప్రాజెక్టుల పనులు ప్రారంభానికి నోచుకో లేదనీ, 2013 భూసేకరణ చట్టంలో మార్పు చేయనిదే భూసేకరణ పని సులభం కాదనీ 28 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా కేంద్రానికి విన్నవించుకు న్నాయి. దీనితో కేంద్రం 2013 చట్టానికి ఎన్డీయే 14 సవరణలు చేసింది. ఇందులో నష్ట పరిహారానికి సంబం ధించి ఎలాంటి మార్పులూ లేవు. దేశ భద్రత, రక్షణ వస్తువుల తయారీ, గ్రామీణ విద్యుద్దీకరణ, పేదలకు గృహవసతి వంటి సదుపాయాల కల్పనకు భూ యాజ మాన్యం ప్రభుత్వం చేతిలోనే ఉండి, ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం లేదా ప్రైవేటు పరిశ్రమల ఏర్పాటు అనివార్యమైనప్పుడు సామాజిక సర్వే, నిర్వాసితుల సమ్మతి లేకుండా భూమిని సేకరించవచ్చునన్న నిబం ధనలను ఈ సవరణ ద్వారా చేర్చారు. ప్రైవేటు పారి శ్రామిక అవసరాలకు పారిశ్రామికవేత్తలే నేరుగా రైతు లతో సంప్రదించి ఉభయుల అంగీకారంతో భూములు కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన దానికంటే ఎక్కువ కొనుగోలు చేసిన ప్రైవేటు సంస్థలకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూర్చాలన్న ఉద్దేశంతోనే ఈ సవరణలు జరిగాయన్న విపక్ష ఆరోపణలలో నిజం లేదు.

 ప్రైవేటు పెట్టుబడు లను ఆహ్వానించక తప్పని వాతావరణంలోనే ఈ చట్టా నికి మార్పులు చేశారు. 75వ స్వాతంత్య్ర దినోత్సవాని కల్లా ఇల్లు లేని 8 కోట్ల మందికి ఆ వసతి కల్పించాలని మోదీ ప్రభుత్వం లక్ష్యం. భూవసతి లేని 30 కోట్ల మంది సంక్షేమం గురించి ఆలోచించవలసిన అవసరం ప్రభు త్వం మీద ఉంది. నాలుగు కోట్ల మంది నిరుద్యోగులకు ఉపాధి, మౌలిక అవసరాల కల్పన వంటివి కూడా ప్రభు త్వ బాధ్యతలే. కాగా, తాము కోరుకున్న రీతిలో భూసే కరణ చట్టాన్ని రూపొందించుకునే హక్కు రాష్ట్రాలకు ఉంది. 120 సంవత్సరాల నాటి చట్టాన్నే ఆశ్రయించు కుని కోట్లాది మందిని నిర్వాసితులుగా మిగిల్చిన కాం గ్రెస్‌కు బీజేపీని విమర్శించే హక్కులేదు. 2015 సవర ణలు సరైనవేనని చరిత్ర రుజువు చేస్తుంది.
 (వ్యాసకర్త బీజేపీ కిసాన్‌మోర్చా
 జాతీయ ప్రధాన కార్యదర్శి)
 మొబైల్: 98497 77899

No comments:

Post a Comment