Thursday 17 April 2014

సంఘ్‌పరివార్ పై బీజేపీ నేతల్లో అసంతృప్తి

సంఘ్‌పరివార్ వైఖరిపై సీమాంధ్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి

Published at: 17-04-2014 16:14 PM
హైదరాబాద్, ఏప్రిల్ 17 : సంఘ్‌పరివార్ వైఖరిపై సీమాంధ్ర బీజేపీ నేతల్లో అసంతృప్తి నెలకొంది. మోదీ హవాను సంఘ్‌పరివార్ సొమ్ము చేసుకుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు(గురువారం) సాయంత్రంలోగా కీలక స్థానాల్లో అభ్యర్థులను మారుస్తారని సీమాంధ్ర బీజేపీ నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీ పొత్తు బీజేపీతోనే కాని సంఘ్‌పరివార్‌తో కాదని, ఈ విషయాన్ని సంఘ్‌పెద్దలు గ్రహించాలని సీమాంధ్ర బీజేపీ నేతలు సూచించారు.
మరోవైపు సీమాంధ్రలో బీజేపీతో-టీడీపీ పొత్తు తెగదెంపులపై సంఘ్‌పరివార్ నేతలు ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. సీమాంధ్రలో బీజేపీతో పొత్తు తెగదెంపులైతే తెలంగాణలోనూ టీడీపీకి సహకరించకూడదని సంఘ్‌పరివార్ నిర్ణయించింది. సీమాంధ్రలోని టీడీపీ అసంతృప్తులకు బీజేపీ బీఫాంలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలియవచ్చింది.

No comments:

Post a Comment