Wednesday 9 July 2014

ప్రాణహిత-చేవెళ్లకు గుంట భూమినీ వదులుకోం

ప్రాణహిత-చేవెళ్లకు గుంట భూమినీ వదులుకోం

Published at: 10-07-2014 05:24 AM
ప్రజాభిప్రాయ సేకరణలో ముంపు గ్రామాల ప్రజల నిరసన
మంచిర్యాల, జూలై 9: డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సుజల స్రవంతి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం కోసం ఒక్క గుంట భూమినీ వదులుకునేది లేదని ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రి మండలం బొక్కల గుట్ట, తిమ్మాపూర్‌, పాత తిమ్మాపూర్‌, కోటేశ్వర్‌రావుపల్లి, పులిమడుగు గ్రామాల ప్రజలు తేల్చిచెప్పారు. ప్రాజెక్టు భూసేకరణ కోసం సబ్‌కలెక్టర్‌ ప్రశాంత్‌పాటిల్‌ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా, పత్రికల్లో ప్రకటన ఇస్తే సరిపోతుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఇష్టానుసారమే పనులు చేపడతామని సబ్‌కలెక్టర్‌ వారికి నచ్చజెప్పారు.

No comments:

Post a Comment