Tuesday 29 July 2014

విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు

విజయవాడలో కిడ్నీ రాకెట్ ముఠా గుట్టురట్టు

Published at: 29-07-2014 12:20 PM
విజయవాడ, జులై 29 : నగరంలో కిడ్నీ రాకెట్ ముఠాను సత్యనారాయణపురం పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంత కాలంగా అమాయకులు, పేద ప్రజలను మభ్యపెట్టి ముఠా సభ్యులు పెద్ద ఎత్తున కిడ్నీలను అమ్ముకుంటూ యదేచ్ఛగా దందాను కొనసాగిస్తున్నారు. మంగళవారం ఉదయం మీడియా ఎదుట నిందితులను ప్రవేశపెట్టగా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ముఠాకు సంబంధించి ప్రధాన సూత్రధారి దుర్గాప్రసాద్ విచారణలో అనేక విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. ఎమ్మార్వో, ఆర్డీవో సంతకాలు ఫోర్జరీ చేసి కిడ్నీలను అమ్మడానికి దుర్గాప్రసాద్ ప్రయత్నించాడు. ఈ నేపథ్యంలో సంతకాలపై అనుమానం వ్యక్తం చేసిన హైదరాబాద్‌కు చెందిన ఓ ఆస్పత్రి వర్గాలు ఈ విషయాన్ని విజయవాడలోని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే దుర్గాప్రసాద్‌ను పట్టుకుని విచారించగా కిడ్నీ రాకెట్ గుట్టు రట్టు అయ్యింది. దీంతో ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

No comments:

Post a Comment