Monday 30 September 2013

జనభేరి కాదు ..దొరల భేరి : దిలీప్‌కుమార్

జనభేరి కాదు ..దొరల భేరి : దిలీప్‌కుమార్

Published at: 01-10-2013 06:18 AM
 New  0  0 
 
 

గోదావరిఖని, సెప్టెంబర్ 30 : తెలంగాణ జేఏసీ ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించిన సకల జన భేరి.. వాస్తవంలో దొరల భేరిగా మారిందని టీఆర్ఎల్‌డీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ దిలీప్‌కుమార్ విమర్శించారు. సభ ఆద్యంతం వ్యక్తి భజనగా సాగిందని, బడుగు, బలహీన వర్గాల నాయకులు లేకుండా సభ ఎలా నిర్వహిస్తారని సోమవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ప్రశ్నించారు. అరుణోదయ విమలక్క, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణమాదిగ, ప్రజా గాయకుడు గద్దర్ లేకుండా సభ నిర్వహించడం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. ఈ విషయంలో జేఏసీ చైర్మన్ కోదండరాం తన వైఖరి మార్చుకోవాలని, జేఏసీని పునర్ వ్యవస్థీకరించాలని డిమాండ్ చేశారు. ఇదంతా చూస్తుంటే దొరల తెలంగాణ వస్తుందేమోనన్న అనుమానం వ్యక్తమవుతుందని వ్యాఖ్యానించారు.
- See more at: http://www.andhrajyothy.com/node/5504#sthash.GnFTUgrb.dpuf

No comments:

Post a Comment