Friday 13 September 2013

టీకొట్టు నుంచి ప్రధాని రేసు దాకా..

https://www.facebook.com/profile.php?id=100004638940884&hc_location=timeline

టీకొట్టు నుంచి ప్రధాని రేసు దాకా..

రోడ్డు పక్కన చాయ్ అమ్ముతూ జీవించిన ఓ సాధారణ కుర్రాడు.. దేశంలో ఓ ప్రధాన జాతీయ పార్టీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా నిలవడం గొప్ప విషయం. ఈ గొప్పదనమంతా నరేంద్ర మోడీ వ్యక్తిత్వంతోనూ, వ్యవహార శైలితోనూ ముడిపడి ఉంది. అత్యంత రహస్యమైన వ్యక్తిగత జీవితం.. విలక్షణ వ్యక్తిత్వం.. వివాదాలు, విమర్శలు, పొగడ్తలను లక్ష్యపెట్టని మనస్తత్వం మోడీది. విపక్షాలు, గిట్టనివారి విమర్శలు, ఆరోపణలనే మెట్లుగా మలచుకొని విజయాన్ని సాధించగల నేర్పు ఆయన సొంతం.
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లా వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న మోడీ జన్మించారు. ఆయన తండ్రి దామోదర్‌దాస్ మూల్‌చంద్ మోడీ, తల్లి హీరాబెన్. మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన మోడీ దామోదర్‌దాస్ ఆరుగురు సంతానంలో మూడోవాడు. తొలిరోజుల్లో వాద్‌నగర్‌లో దామోదర్‌దాస్ నిర్వహించిన టీకొట్టే ఆ కుటుంబ పోషణకు ఆధారం. మోడీ చిన్నతనంలో తండ్రి కొట్టు నుంచి కెటిల్‌లో చాయ్ తీసుకెళ్లి వాద్‌నగర్ రైల్వే స్టేషన్లో తిరుగుతూ అమ్మేవాడు. చిన్ననాడే సంఘ్ పరివార్ పట్ల ఆకర్షితుడైన మోడీ.. 1971 సమయంలో ఢిల్లీలోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం నాలుగింటికే నిద్రలేచి కార్యాలయాన్ని ఊడవడం, టీ, టిఫిన్లు తయారుచేసి సీనియర్లకు అందజేయడం వంటివి చేసేవాడు. ఆ తర్వాత ఆర్‌ఎస్‌ఎస్‌లో ప్రచారక్‌గా నియమితులయ్యారు. ఢిల్లీ వర్సిటీలో చదువుకుంటూనే ఏబీవీపీలో చురుకైన కార్యకర్తగా పేరుపొందారు. 1992లో పార్టీ సంస్థాగత కార్యదర్శిగా ఎంపికయ్యారు. అనంతరం 1995లో పార్టీ జాతీయ కార్యదర్శి పదవి పొందారు. 1996లో గుజరాత్‌లో బీజేపీ తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సీఎం కేశూభాయ్ పటేల్‌కు కీలక అనుచరుడిగా పనిచేశారు. మోడీ పనితీరు, చురుకుదనం చూసిన అద్వానీ 1998లో గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. కేశూభాయ్‌తో విభేదాల కారణంగా ఢిల్లీ వెళ్లిపోయి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2000వ సంవత్సరంలో గుజరాత్‌ను కుదిపేసిన భూకంపం మోడీ జీవితాన్ని మలుపుతిప్పింది. పునర్నిర్మాణ పనుల్లో కేశూభాయ్ విఫలమయ్యారనే ఆరోపణల నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం.. మోడీ సీఎం పదవి చేపట్టడం జరిగింది. ఇక ఆ తరువాత మోడీ వెనక్కితిరిగి చూడలేదు. 2002, 2007, 2012ల్లో వరుసగా మూడుసార్లు బీజేపీని విజయపథంలో నడిపించి, సీఎం పదవిని చేపట్టారు. పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేసిన మోడీ గుజరాత్‌లో చేసిన అభివృద్ధే ఓ మంత్రంగా మారిపోయింది. పటిష్ట విధానాలతో కొనసాగిన ఆయన పరిపాలన ప్రజల్లో అభిమానాన్ని సాధించి పెట్టింది. నేటి స్థితిలో జాతీయంగా 75 శాతం యువత, 42 శాతం జనాభా, 65 శాతం పట్టణ ప్రాంతపు ప్రజలు మోడీలో ఒక జాతి రక్షకుడిని, జాతీయ నాయకుడిని చూస్తున్నారు. నేడు దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సంక్షోభాల నుంచి దేశాన్ని గట్టెకించే ఒకేఒక నాయకుడు మోడీ' అని భారతీయ ప్రజానీకం ప్రగాడ విశ్వాసంతో ఉంది..@ బహుజన బంధు.



దేశాన్ని సంక్షోభం నుంచి గట్టెక్కిద్దాం..

అందరి ఏకాభిప్రాయంతో నరేంద్ర మోడీని బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటిస్తున్నట్లు బీజేపీ జాతీయాధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. కిక్కిరిసిన విలేకరుల సమావేశంలో ఆయనీ విషయం ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ మాట్లాడుతూ...

''..దేశం సంక్షోభంలో ఉంది.. ఇలాంటి సమయంలో ఈ సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు బీజేపీ తరఫున పోరాటం చేస్తాం. చిన్న కుగ్రామం నుంచి.. అతి చిన్న కుటుంబం నుంచి.. ఓ కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నాలాంటి సాధారణ వ్యక్తికి పార్టీ జాతీయ నాయకత్వం అతిపెద్ద బాధ్యత అప్పగించింది. 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించాలంటే ప్రజల మనోభావాలను, కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని ముందుకెళ్లాలి. వాజ్ పేయి, అద్వానీ లాంటి పెద్దల కృషితో వటవృక్షంలా ఎదిగిన ఈ పార్టీ నీడన ఉన్న కార్యకర్తలందరికీ వినమ్రంగా నమస్కరిస్తున్నా...పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు శ్రమించడానికి ఏమాత్రం వెనకాడను. సామాన్యుల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తాను...ఇక్కడున్న అందరి ద్వారా కోట్లాది మంది భారతీయుల ఆశీస్సులు కోరుతున్నాను...కష్టాల్లో ఉన్న ఈ దేశాన్ని కాపాడేందుకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయుడు బీజేపీ కమలాన్ని తీసుకుని, ఒక కొత్త ఆశతో బీజేపీకి పూర్తిగా సమర్థిస్తారని ఆశిస్తున్నాను...మీడియాకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను....బీజేపీని పైకి తీసుకురావడానికి చాలాసార్లు మీరు సాయపడ్డారు....అవినీతి, అధిక ధరలకు వ్యతిరేకంగా.. స్వరాజ్యం, వికాసం కోసం మీ అందరి సహకారం మాకు అవసరం...పార్టీలో పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఈ సమావేశానికి రాలేకపోయినా ఫోన్ చేసి ఆశీస్సులు ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు..''// బహుజన బంధు.
— with హైందవ బహుజనం.


బి.సి. నాయకుడు కాబట్టి ప్రధాని పదవి ఆయనకివ్వటం బహుజనాధికారం నెలకొల్పినట్లే..ఈ పరిణామం బాజపా సంప్రదాయ నాయకత్వంలో పెద్ద మార్పుని తెస్తుంది. నేడు జాతీయంగా దళిత-బహుజన వర్గాలు సామాజిక, రాజకీయ చైతన్యంలో ఎంతో ఎత్తుకు ఎదిగాయి. ఆర్థిక రాజకీయ శక్తులను ప్రభావితం చేగలిగిన మధ్యతరగతి స్థాయికి ఎదిగారు. నేటిస్థితిలో జాతీయంగా 75 శాతం యువత, 42 శాతం జనాభా, 65 శాతం పట్టణ ప్రాంతపు ప్రజలు మోడీలో ఒక జాతి రక్షకుడిని చూస్తున్నారు. అందుకే భారత జాతికి మోడీ లాంతి నాయకుని అవసరం ఎంతో ఉంది..@ బహుజన బంధు.

బిజెపి పార్టీ నాయకులు అందరూ చర్చించిన అనంతరం మోదీయే సరైన అభ్యర్థి అని నిర్ణయించిన అనంతరం బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంధ్ర మోదీ మాటాడుతూ...

''..దేవుడిచ్చిన శక్తితో దేశానికి సేవ చేసే అవకాశం దక్కింనదుకు ప్రతి ఒక్క భారతీయునికి కృతజ్ఞతలు....ప్రతి భారతీయునికి, బాజపానాయకులకు, కార్యకర్తలకు రుణపడి ఉంటాను...2014 ఎన్నికల్లో పార్టీ విజయానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తాను...దేశ ప్రజల ధన,మాన,ప్రాణాలకు అందా ఉండేందుకు సర్వశక్తులను ఉపయోగిస్తా..''నని ఆయన హామీ ఇచ్చారు..@ బహుజన బంధు.

No comments:

Post a Comment