Wednesday 21 May 2014

రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం చేయాలి

Published at: 21-05-2014 13:35 PM
హైదరాబాద్, మే 21 : ఆంధ్రప్రదేశ్ భావి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు రైతు రుణమాఫీపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఏపీసీసీ చీఫ్ రఘవీరారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం రైతాంగ సమస్యలపై రఘువీరా నేతృత్వంలోని పలువురు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత రుణమాఫీపై చంద్రబాబు తొలిసంతకం చేయాలన్నారు. రుణమాఫీ చేస్తారని తాము విశ్వసిస్తున్నామని తెలిపారు. రైతాంగానికి రుణాలు రీషెడ్యూల్ చేయాలని రఘువీరా డిమాండ్ చేశారు. మరోవైపు మెడికల్ సీట్లకు సంబంధించి పేద విద్యార్థులకు ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని కాంగ్రెస్ నేతలు గవర్నర్ దృష్టి తీసుకెళ్లారు.

No comments:

Post a Comment