Saturday 10 May 2014

మోదీకి మద్దతు ఇస్తామని చెప్పలేదు: జగన్

మోదీకి మద్దతు ఇస్తామని చెప్పలేదు: జగన్

Published at: 10-05-2014 08:13 AM
హైదరాబాద్: ఎన్నికల్లో 25 మంది ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని నిలబెడతామన్నానే తప్ప, బీజేపీకి, మోదీకి మద్దతు ఇస్తామని ఎక్కడా ప్రకటించలేదని వైసీపీ అధినేత జగన్ ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఢిల్లీ గద్దెను నిర్దేశించేది తామేనని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో ఎవరిని అధికారంలో కూర్చో బెట్టాలన్నది తమ 25 మంది ఎంపీలతో నిర్ణయిస్తామన్నారు. రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామికంగా వ్యవహరించడం వల్లే ఆ పార్టీ పాలించే అర్హతను కోల్పోయిందన్నారు. తెలుగు ప్రజల కోసం తాము పోరాడామని, చంద్రబాబు పూర్తిగా మోదీపైనే ఆధారపడ్డారని, ఆయనలా చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు.

No comments:

Post a Comment