Saturday 10 May 2014

వైసీపీ గెలిస్తే సెక్యులర్ ఓట్లుగా భావించాలని

ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంది : డొక్కా

Published at: 10-05-2014 14:31 PM


హైదరాబాద్, మే 10 : 2014 ఎన్నికల్లో ప్రజాస్వామ్యం అపహాస్యపాలైందని మాజీ మంత్రి డొక్కామాణిక్యవరప్రసాద్ విమర్శించారు. శనివారం ఇందిరాభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సీమాంధ్రలో గెలిచిన అభ్యర్థులు ఇంటికెళ్లి ఏడుస్తారని, ఓడిపోయిన వారు కౌంటింగ్ కేంద్రంలో ఏడుస్తారన్నారు. అభ్యుర్థులు అప్పులపాలై ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. చంద్రబాబు, మోదీ జోడీని సీమాంధ్రులు వ్యతిరేకించారని వెల్లడించారు. వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ లేదా వైసీపీకే పడతాయని, వైసీపీ గెలిస్తే సెక్యులర్ ఓట్లుగా భావించాలని డొక్కామాణిక్యవరప్రసాద్ అన్నారు.

No comments:

Post a Comment