Sunday 22 March 2015

అమరావతి పేరు ఖరారు

ఏపీ నూతన రాజధానికి అమరావతి పేరు ఖరారు

హైదరాబాద్‌, మార్చి 23 : నవ్యాంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరానికి అమరావతి పేరును ఖరారు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన చేయనున్నారు. ఉగాది రోజునే అమరావతి పేరును ఖరారు చేయాలనుకున్నారు. పంచరామాల్లో ఒకటైన అమరావతి పేరును పెట్టడం వల్ల పురాతన ప్రాభవం రాష్ట్ర రాజధానికి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బౌద్ధరామాల్లో ఒకటిగా నిలిచిన అమరావతి పేరును పెట్టడం వల్ల పురాతన చారిత్రక నేపధ్యానికి ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది.

No comments:

Post a Comment