Tuesday 21 October 2014

జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలి: ఏపీయూడబ్ల్యుజే

జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం కల్పించాలి: ఏపీయూడబ్ల్యుజే

దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్‌ సదుపాయం అమలు జరుగుతున్నదని ఏపీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు డి.సోమసుందర్‌ పేర్కొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్న జర్నలిస్టులకు 65 ఏళ్లు నిండిన తర్వాత ప్రభుత్వపరంగా పెన్షన్‌ కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. పలు రాష్ట్రాల్లో జర్నలిస్టులకు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు పెన్షన్‌ అందిస్తున్నారని వివరించారు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో మంగళవారం ఆయన మాట్లాడారు.

No comments:

Post a Comment