Monday 27 October 2014

తండ్రిని వదిలేసిన తనయుడు.. అక్కున చేర్చుకున్న వృద్ధతల్లి

తండ్రిని వదిలేసిన తనయుడు.. అక్కున చేర్చుకున్న వృద్ధతల్లి

మండపేట,అక్టోబర్‌ 27: కన్నతండ్రిని చావుబతుకుల మధ్య వదిలేశాడు తనయుడు. వృద్ధాప్యంలో తనయుడిని కంటికి రెప్పలా కాపాడుతూ తన మా తృత్వాన్ని చాటుకుంది ఓ వృద్ధతల్లి. తూర్పుగోదావరి జిల్లా మండపేట పెరంటాళ్లమ్మవారి ఆలయం సమీపంలో వున్న పెద్దచెట్టు వద్ద పదిరోజులనుంచి కొమ్మిశెట్టి వరహాలు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. భార్య చనిపోగా పక్షవాతం రాగా కొడుకు వదిలేశాడు. వరహాలుకు ఇల్లులేకపోవటంతో రోడ్డుపక్కన వున్న చెట్టు మొదలుకు టార్పాలిన్‌వేసి మంచం పట్టిన కొడుకును పాచిపని చేసుకుంటూ తల్లి అచ్చమ్మ చూసుకుంటున్నది. 

No comments:

Post a Comment