. మావోయిస్ట్‌ పార్టీ గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి శరత్‌
. ఏవోబీలో బహిరంగ సభ నిర్వహణ

విశాఖపట్నం, సెప్టెంబర్‌ 19: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని మావోయిస్ట్‌ గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి శరత్‌ హెచ్చరించారు. జతిన్‌ మహంతి వర్ధంతిని పురస్కరించుకుని ఈ నెల 13 నుంచి నిర్వహిస్తున్న ఖైదీల హక్కుల వారోత్సవాల్లో భాగంగా గురువారం ఆంధ్రా, ఒడిసా సరిహద్దు అటవీ ప్రాంతంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఉద్యమకారులను రాజకీయ ఖైదీలుగా గుర్తించి తక్షణమే విడుదల చేయాలని, ఆదివాసీలపై అక్రమ కేసుల బనాయింపు, వేధింపులు ఆపాలని శరత్‌ డిమాండ్‌ చేశారు. తవ్వకాలకు