Monday 1 September 2014

ఏపీలో ముస్లింకు మంత్రి పదవి ఇవ్వాలి


ఏపీలో ముస్లింకు మంత్రి పదవి ఇవ్వాలి
ఆంధ్ర, తెలంగాణ మైనార్టీ సెల్‌ తీర్మానం
హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 (ఆంధ్రజ్యోతి):ఆంధ్రప్రదేశ్‌లో ఒక ముస్లింకు మంత్రి పదవి ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాషా్ట్రల మైనార్టీ సెల్‌ తీర్మానం చేశాయి. సోమవారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన ఆంధ్ర, తెలంగాణ రాషా్ట్రల మైనార్టీ సెల్‌ సమావేశానికి మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్‌ అధ్యక్షత వహించారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ముస్లింలందరూ కలిసి టీడీపీ కోసం పనిచే సి, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తీర్మానించారు. పార్టీ కోసం ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పటినుంచో పనిచేసే వాళ్లకు నామి నేటెడ్‌ పదవులు ఇవ్వాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముస్లింలకు కేంద్రం పరిధిలోని నామినేటెడ్‌ పదవులు ఇచ్చి తగిన న్యాయం చేయాలని తీర్మానం చేశాయి. రెండు రాషా్ట్ర ల్లో నూతన కమిటీల ఏర్పాటు గురించి సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథులుగా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎంఏ షరీప్‌, మాజీ మంత్రి ఖలీల్‌ బాషా, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు యూనుస్‌ అక్‌బానీ, ఎండీ యూసుఫ్‌, అమీర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment