Wednesday 3 February 2016

మీడియాకు ముద్రగడ క్షమాపణలు

మీడియాకు ముద్రగడ క్షమాపణలు
03-02-2016 11:23:38

తూ.గో : తునిలో మీడియా ప్రతినిధులపై దాడి జరగడంపై ముద్రగడ పద్మనాభం మీడియాకు క్షమాపణలు చెప్పారు. బుధవారం తునికి చేరుకున్న ముద్రగడను మీడియా ప్రతినిధులు నిలదీశారు. మీడియా ప్రతినిధులపై దాడులు చేయడమేంటని ముద్రగడను జర్నలిస్టులు ప్రశ్నించారు. దీంతో జర్నలిస్టులతో ముద్రగడ అనుచరులు వాగ్వాదానికి దిగారు. చివరకు ఆరోజు ఘటనపై మీడియాకు ముద్రగడ పద్మనాభం క్షమాపణలు తెలియజేశారు.

No comments:

Post a Comment