Monday 9 November 2015

సంఘ్‌ నేతలతో ఏపీ బీజేపీ ముఖ్యుల సమాలోచన

సంఘ్‌ నేతలతో ఏపీ బీజేపీ ముఖ్యుల సమాలోచన 
Updated :10-11-2015 02:03:15

హైదరాబాద్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రీ‌య స్వయంసేవక్‌ సంఘ్‌ నేతలతో ఏపీ బీజేపీ ముఖ్యులు సమాలోచనలు జరిపారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి ఏపీ నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె హరిబాబు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు, రాయలసీమకు చెందిన ముఖ్య నేతలు, తదితరులు హాజరయ్యారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి ఏపీ, తెలంగాణ, ఉత్తర, దక్షిణ కర్ణాటక రాషా్ట్రల ఇన్‌చార్జి శ్యామ్‌కుమార్‌, సి.రామకృష్ణ, భరత పాల్గొన్నారు. ప్రత్యేక రాయలసీమ ఏర్పాటు చేయాలని కొంత కాలంగా వివిధ సంస్థలు, సంఘాలు చర్చావేదికలు నిర్వహించడంపైనా.. ప్రజల్లో నెలకొన్న అభిప్రాయాలపైనా.. సీమ సమస్యలపైనా వారు ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.

No comments:

Post a Comment