Saturday 22 October 2016

Manohar smells rat in Rs. 28-cr. spend on Partnership Summit

Manohar smells rat in Rs. 28-cr. spend on Partnership Summit
Updated: October 18, 2016 07:13 IST

http://www.thehindu.com/news/cities/Vijayawada/manohar-smells-rat-in-rs-28cr-spend-on-partnership-summit/article9232896.ece

Status of MoUs singned and jobs created unknown, he says

The efforts being made by the State government to suppress the huge expenditure behind the CII-Partnership Summit held in Visakhapatnam, authorised merely with inter-departmental memos, is tantamount to “criminal conspiracy,” former Legislative Assembly Speaker Nadendla Manohar has said.

Addressing the media here on Monday, Mr. Manohar said information on expenditure for the summit acquired using the provisions of the RTI Act had turned out to be shocking.

The government, which often complained of resource crunch, spent Rs. 28 crore for the summit where the government had signed 361 MoUs involving Rs. 4,76,878 crore with the potential of generating 10,27,121 jobs.

The status of these MoUs and jobs was unknown even after nine months, but Ministers were already talking about the second round.

Mr. Manohar said the attitude of Chief Minister N. Chandrababu Naidu and senior officers, who violated several administrative and procedural norms, could only be described as “irresponsible.”

Mr. Manohar, along with PCC RTI Cell chairman P. Lakshmi Narayana, provided to the media details of the money spent for the Partnership Summit.

The expenditure included Rs. 7.4 crore spent for temporary air-conditioned tents to hold the meeting. As much as Rs. 1 crore was spent to place an advertisement in an international daily and crores were paid to several star and other hotels and to transport companies for bills during the three days.

A comparatively huge amount of Rs. 1 crore was spent for the song and dance programmes at the inauguration of the summit, Mr. Manohar said. He said the government was often bragging of transparency and good administration, but neither was evident in the organising of the summit.
విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్
Sakshi | Updated: October 18, 2016 01:55 (IST)
http://www.sakshi.com/news/top-news/visakhapatnam-partnership-conference-was-bogus-412728
విశాఖ భాగస్వామ్య సదస్సు బోగస్
మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ విమర్శ

 సాక్షి, అమరావతి: ప్రభుత్వం విశాఖపట్నంలో ఈ ఏడాది జనవరిలో ఎంతో అట్టహాసంగా కోట్లు ఖర్చుపెట్టి నిర్వహించిన భాగస్వామ్య సదస్సు బోగస్ అని మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. సమ్మిట్‌లో జరిగిన 361 ఎంఓయూల ద్వారా రూ. 4,76,878 కోట్లు పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం ప్రకటించిందని, అయితే పది నెలలు దాటినా ఒక్క పరిశ్రమ కూడా రాలేదని పేర్కొన్నారు.

రాష్ట్రానికి 10 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పగా.. ఒక్క ఉద్యోగం కూడా రాలేదనే విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా బహిర్గతమైందన్నారు. ఆంధ్రరత్న భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పీసీసీ ఆర్టీఐ చైర్మన్ లక్ష్మినారాయణ, విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు, అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీతో కలిసి ఆయన మాట్లాడారు.


7 లక్షల కోట్లు
23-10-2016 01:05:17

http://www.andhrajyothy.com/artical?SID=325470

జనవరిలో విశాఖ వేదికగా నిర్వహణ
అన్ని శాఖలూ భాగస్వాములు కావాలి
భారీగా పెట్టుబడులు ఆకర్షించాలి
అధికారులకు చంద్రబాబు నిర్దేశం
ప్రతి శాఖకూ బాధ్యతలు కేటాయింపు
‘పరిశ్రమ’లకు ఆటోమొబైల్‌
గ్రామీణాభివృద్ధికి కుటీర పరిశ్రమలు
ఈడీబీకి విదేశీ పెట్టుబడుల ఆకర్షణ

హైదరాబాద్‌, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్రకు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. పెట్టుబడుల లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో రూ.4.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించిన ఏపీ సర్కార్‌, వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే సదస్సులో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది.

అన్ని శాఖలకూ భాగస్వామ్యం
తొలి భాగస్వామ్య సదస్సు ఇచ్చిన ఉత్సాహంతో మరోసారి సీఐఐ ఆధ్వర్యంలో విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు పరిశ్రమల శాఖ సిద్ధమవుతోంది. ఇటీవల పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు నిర్వహణపై సీఎం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్‌, ఆర్థికాభివృద్ధి మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి జాస్తి కృష్ణ కిశోర్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. సుమారు రూ.7 లక్షల కోట్ల మేర పెట్టుబడులను ఆకర్షించాలని సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు అంటే కేవలం పరిశ్రమల శాఖకు సంబంధించిన అంశంగానే పరిగణించేందుకు వీల్లేదని, అన్ని శాఖలకూ సదస్సులో భాగస్వామ్యం కల్పించాలని సీఎం ఆదేశించారు. దీనివల్ల ప్రభుత్వ శాఖల నడుమ సమన్వయం పెరగడంతోపాటు ఒప్పందాలు వేగంగా కార్యరూపం దాల్చడానికి దోహదపడుతుందన్నారు. సీఎం వాదనతో సీఎస్‌ టక్కర్‌ ఏకీభవించారు. ప్రభుత్వ శాఖలన్నీ భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ప్రయత్నిస్తే రాష్ట్ర వృద్ధి రేటు రెండంకెలకు చేరుకుంటుందని అభిప్రాయపడ్డారు.

శాఖల వారీగా బాధ్యతలు
పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులో వివిధ రంగాలకు చెందిన సంస్థలతో మాట్లాడి పెట్టుబడులను ఆకర్షించే బాధ్యతను పలు శాఖలకు అప్పగించారు. విదేశీ పెట్టుబడులను ఆకర్షించే బాధ్యతను రాష్ట్ర ఆర్థికాభివృద్ధి సంస్థ (ఈడీబీ)కు సీఎం అప్పగించారు. రాష్ట్రంలో విదేశీ సంస్థలు ఏయే రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముందో అధ్యయనం చేసి, ఆయా సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించే బాధ్యతను ఈడీబీ సీఈవో జాస్తి కృష్ణ కిశోర్‌ చూస్తారు. వస్తు తయారీ, ఆటోమొబైల్‌ రంగాలకు సంబంధించిన సంస్థలు రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా చూసే బాధ్యతను పరిశ్రమల శాఖకు అప్పగించారు. వ్యవసాయ రంగ యంత్రాల తయారీ, ఇతర యూనిట్ల స్థాపన బాధ్యత వ్యవసాయశాఖకు అప్పగించారు. పర్యాటకాభివృద్ధి సంస్థలను ఆకర్షించే బాధ్యతను పర్యాటక శాఖకు అప్పగించారు. నవ్యాంధ్రలో రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉన్నందున ఈ రంగంలో దేశ, విదేశీ సంస్థల నుంచి పెట్టుబడులను రాబట్టే బాధ్యతను గృహనిర్మాణ శాఖకు అప్పగించారు. కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రాష్ట్రంలోని మహిళా బృందాలను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చని, ఈ దిశగా పెట్టుబడిదారులను ఒప్పించి పరిశ్రమలను ఏర్పాటు చేసే బాధ్యతను గ్రామీణాభివృద్ధి శాఖకు చంద్రబాబు అప్పగించారు. రాష్ట్రంలో ఆహార తయారీ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో పెట్టుబడులు ఆకర్షించే బాధ్యతను ఆహార తయారీ పరిశ్రమ సీఈవోకు అప్పగించారు. ఈసారి నిర్వహించే పారిశ్రామిక భాగస్వామ్య సదస్సు ఆషామాషీగా కాకుండా నిర్మాణాత్మకంగా .. ఆచరణాత్మకంగా ఉండాలని చంద్రబాబు ఆదేశించారు.

పెట్టుబడులకూ రియల్‌ టైమ్‌
ప్రభుత్వ పాలనలో రియల్‌ టైమ్‌ గవర్నెన్స్‌కు పెద్దపీట వేస్తున్న సీఎం... పారిశ్రామిక భాగస్వామ్య సదస్సులోనూ ఇదే తరహా విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి గురించి సదస్సులో వివరిస్తారు. రాష్ట్రానికి ఇప్పటి వరకు ఎన్ని పెట్టుబడులు వచ్చాయన్నది అంకెల్లో చూపడం కాకుండా ఎక్కడెక్కడ ఏయే పరిశ్రమలు వచ్చాయి.. ఎంత పెట్టుబడులు పెట్టారు.. ఎంత మందికి ఉపాధి కల్పిస్తున్నారన్న అంశాలను వీడియో ద్వారా సదస్సులో పాల్గొనేవారికి చూపించాలని పరిశ్రమల శాఖను సీఎం ఆదేశించారు.

No comments:

Post a Comment