Tuesday 18 March 2014

భారత దేశానికి శ్రీరామరక్ష నరేంద్ర మోదీ : వెంకయ్య

భారత దేశానికి శ్రీరామరక్ష నరేంద్ర మోదీ : వెంకయ్య

Published at: 18-03-2014 18:45 PM
హైదరాబాద్, మార్చి 18 : భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోదీ భారత దేశానికి శ్రీరామ రక్ష అని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కొనియాడారు. మోదీ నాయకత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందని ఆయన అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రజలంతా మోదీ ప్రధాని కావాలని కోరకుంటున్నారని అన్నారు. పలు పార్టీల అగ్రనేతలు మోదీ సమర్థవంతమైన నేత అని చెబుతున్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు. సుపరిపాలన, సమర్థత, సుస్థిర ప్రభుత్వం మోదీతోనే సాధ్యమని ఆయన అన్నారు.
తెలంగాణ, సీమాంధ్రలో అభ్యర్ధుల ఎంపిక విషయంలో జోక్యం చేసుకోనని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అలాగే తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పొత్తుల విషయంలో కూడా జోక్యం చేసుకోనని ఆయన పేర్కొన్నారు. ఈ రెండు రాష్ట్రాల పొత్తుల బాధ్యతను తమ పార్టీ నేత అరుణ్‌జైట్లీకి అప్పగించినట్లు వెంకయ్యనాయుడు తెలిపారు. అరుణ్‌కు ప్రకాశ్‌జవదేకర్ సహాయం చేస్తారని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా ప్రకాశ్ జవదేకర్ రాష్ట్ర నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ, సీమాంధ్రలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, చివరి జాబితాలో అభ్యర్థులను ప్రకటిస్తామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment