Thursday 13 March 2014

బీజేపీతో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !

బీజేపీతో పొత్తుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ !

Published at: 11-03-2014 16:51 PM
హైదరాబాద్, మార్చి 11 : భారతీయ జనతా పార్టీతో పొత్తుకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇదే విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలకు టెలీకాన్ఫరెన్స్ ద్వారా తెలియజేసినట్లుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని నేతలకు సూచించినట్లు తెలియవచ్చింది.
కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలతో ఏ స్థాయిలో కూడా కలిసి పనిచేయవద్దని నేతలకు చంద్రబాబు సూచించారు. స్థానికంగా ఉన్న బీజేపీ నేతలతో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు. బీజేపీతో కలిసి పనిచేయాలని చంద్రబాబు పరోక్షంగా పార్టీ శ్రేణులకు, ముఖ్య నేతలకు ఒక క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది.
మరోవైపు గత రెండు రోజులుగా చంద్రబాబు పార్టీలోని ముఖ్య నేతలందరిని పిలుపించుకుని విడివిడిగా చర్చలు జరుపుతున్నారు. బీజేపీతో కలిసి వెళ్లే అంశంపై నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు. సీమాంధ్రను అభివృద్ధి చేయాలన్నా కేంద్రం అండదండల అవసరం ఉంది కాబట్టి, బీజేపీతో కలిసి వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందని బాబు స్పష్టత ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం రెండు పార్టీల మద్య మున్సిపల్ ఎన్నికల వరకు పొత్తు ఉంటుందని సమాచారం. అయితే అధికారికంగా ప్రకటన వెలువడలేదు.

No comments:

Post a Comment