Sunday 8 March 2015

భయపడేలా కఠినంగా శిక్షస్తాం: చంద్రబాబు

భయపడేలా కఠినంగా శిక్షస్తాం: చంద్రబాబు

Sakshi | Updated: March 09, 2015 11:43 (IST)
హైదరాబాద్ : మహిళలపై అత్యాచారాలు జరిపే వారిని కఠినంగా శిక్షిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.  కఠిన శిక్షలు అమలు చేసి మరొకరు ఆ పని చేసేందుకు భయపడేలా చూస్తామని ఆయన సోమవారం అసెంబ్లీలో తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఓ దళిత మహిళపై జరిగిన అత్యాచారం, హత్యపై అసెంబ్లీ అట్టుడికింది. దోషుల్ని తక్షణం పట్టుకొని శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించినట్టు ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడితే మరోసారి అలా చేసేందుకు భయపడేలా నిందితులను కఠినంగా శిక్షిస్తామని  చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సాక్షిగా హెచ్చరించారు.

No comments:

Post a Comment