Saturday 7 March 2015

మోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది - జగన్

నరేంద్రమోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసింది
ఎట్టకేలకు కేంద్ర బడ్జెట్‌పై స్పందించిన వైఎస్‌ జగన్‌ (07-Mar-2015)

హైదరాబాద్‌, మార్చి 7 : కేంద్ర బడ్జెట్‌పై చాలా రోజుల తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి స్పందించారు. నరేంద్ర మోదీ బడ్జెట్‌ తీవ్ర నిరాశకు గురిచేసిందని అన్నారు. బడ్జెట్‌లో ప్రత్యేక హోదా ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్న జగన్‌ ఎన్డీఏలో టీడీపీ ఎందుకు కొనసాగుతుందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. తక్షణమే కేంద్రానికి చంద్రబాబు తన మద్దతు ఉపసంహరించుకోవాలన్నారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన వైఎస్‌పై పవన్‌ చేసిన ఆరోపణలు విచారకరమని, పవన్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా అని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

No comments:

Post a Comment