Wednesday 26 April 2017

ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది

ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది
21-04-2017 17:26:01

చిత్తూరు జిల్లా: ఒక్క ప్రమాదం 20 మందిని కబళించింది... చిత్తూరుజిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోరమైన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపైకి లారీ దూసుకువచ్చి 20 మందిని బలితీసుకుంది. సాధారణ రోడ్డు ప్రమాదాలు జరిగితే ఇంతపెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం అరుదు. ఏర్పేడు పోలీస్ స్టేషన్ ఎదుట జరిగింది...ఓ బీభత్స కాండ.. ఆందోళన చేస్తున్నవారిపైకి అదుపు తప్పిన లారీ దూసుకువచ్చి పక్కనే ఉన్న కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టి...ప్రమాదం, షార్ట్ సర్క్యూట్ కలగలిసి ఇంతమందిని బలితీసుకున్న విషాదమిది. ఇలాంటి ప్రమాదం జరిగిన తీరు ఇంతవరకు చూడలేదని అక్కడ చూసినవారు అన్నారు.

1 comment: