Wednesday 26 April 2017

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు

ఆ ఇద్దరినీ సస్పెండ్‌ చేస్తున్నా: సీఎం చంద్రబాబు
Posted On: Sunday,April 23,2017

                     న్యూఢిల్లీ: బరితెగించిన టీడీపీ ఇసుక మాఫియా 17 మందిని పొట్టనపెట్టుకున్న ఏర్పేడు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు స్పందించారు. నీతిఆయోగ్‌ సర్వసభ్య సమావేశంలో పాల్గొనే నిమిత్తం ఆదివారం ఢిల్లీ వెళ్లిన ఆయన.. అక్కడి నుంచే తూతూమంత్రపు చర్యలకు ఆదేశాలు జారీచేశారు.
            ఇసుక మాఫియా కారణంగా 17 మంది దారుణంగా చనిపోయిన సంఘటనపై సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తేల్చిచెప్పారు. మునగలపాలెం ఇసుక మాఫియా డాన్‌లు, తెలుగుదేశం పార్టీకి చెందిన ధనుంజయనాయుడు, చిరంజీవి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సరైన చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగా ఎమ్మార్వోను సైతం సస్పెండ్‌ చేస్తున్నట్లు చెప్పారు. తాగి వాహనాలు నడిపేవారి లైసెన్సులు రద్దు చేస్తామని సీఎం హెచ్చరించారు.

3 ఏళ్ల తర్వాత ఇసుక మాఫియాపై బాబు స్పందన
Share|
April 26 2017, 7:06 pm

మూడేళ్ల తర్వాత ఇసుక మాఫియాపై ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొద్దిగా స్పందించారు. ఇసుక దందా వల్లే చిత్తూరు జిల్లా ఏర్పేడులో ప్రమాదం జరిగి పదిహేడు మంది మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో పార్టీకి చెందిన ఇద్దరు ధనుంజయ నాయుడు,చిరంజీవి నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మండల తహశీల్దార్ ను సస్పెండ్ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. డిల్లీలో ఈ విషయం ఆయన తెలిపారు. విపక్ష నేత జగన్ అక్కడకు వెళ్లి పరామర్శించి ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. ఇసుక మాఫియా కారణంగా 17 మంది దారుణంగా చనిపోయిన సంఘటనపై సీనియర్‌ అధికారితో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు. నివేదిక వచ్చిన తర్వాతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

https://news.google.pk/news/more?ncl=dXOXUvkSzeiq2QMf8bEOclAuM_K8M&authuser=0&ned=en_pk&hl=te

No comments:

Post a Comment