Wednesday 26 April 2017

లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం

లోకేష్, బొజ్జలకు చేదు అనుభవం 
13:48 - April 22, 2017

చిత్తూరు : ఏర్పేడు మృతుల కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన మంత్రి నారా లోకేష్‌ , బొజ్జలకు చేదు అనుభవం ఎదురైంది. ఇందంతా అధికారుల నిర్లక్ష్యం వల్ల జరిగిందని బాధితులను వారిని నిలదీశారు. మానవ తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగింది. దీని వెనుక ఇసుక మాఫియా ఉందన్న వాదానను లోకేష్ ఖండించారు. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం కింద రూ.10 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. శుక్రవారం లారీ ప్రమాద ఘటనలో 16 మంది మృతి చెందారు. వీరు ఇసుక మాఫియాపై ఫిర్యాదు చేయడానికి పోలీసు స్టేషన్ వెళ్లారు. ఫిర్యాదుపై సీఐ స్పందించలేదు. అయితే అక్కడే ఉన్న వారి పైకి లారీ దూసుకొచ్చింది. దీంతో 15 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 21 మందికి గాయాలైన విషయం తెలిసిందే.

No comments:

Post a Comment