Friday 4 March 2016

చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స

మీరు ఇక్కడ ఉన్నారు: హోం హైదరాబాద్కథ

చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్స

Sakshi | Updated: March 04, 2016 14:16 (IST)
చంద్రబాబు మీ పనయిపోయింది: బొత్సవీడియోకి క్లిక్ చేయండి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ రాజధాని భూ దోపిడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేకపోతున్నారని  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆయన శుక్రవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తేలు కుట్టిన దొంగలా సీఎం బేలగా మాట్లాడుతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. ఈ భూ దందా సమాధానం చెప్పకపోగా, పై పెచ్చు భూములు కొంటే తప్పేంటని ప్రశ్నించడం దారుణమని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతంలో భూములు కొన్న మంత్రులు, ఎమ్మెల్యేలపై ప్రభుత్వపరంగా ఏం చర్యలు తీసుకుంటారని బొత్స ప్రశ్నించారు.

 'చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎన్టీఆర్ అల్లుడో, నారా లోకేశో తండ్రో కాదు...  రాష్ట్ర ముఖ్యమంత్రి. సీఎంగా రాజ్యాగంపై ప్రమాణం చేసిన విషయం గుర్తు తెచ్చుకోండి. అలాంటి మీరు రాజధాని కడతానని రైతులను బెదిరించి మీ తాబేదార్లుకు, మంత్రులకు, మీ వాళ్లకు భూములు ఇప్పించుకున్నారు. ఆ భూముల ద్వారా కొన్ని లక్షల కోట్ల రూపాయిలు లూటీ చేయడానికి ప్రయత్నిస్తున్నారే. దాని గురించి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. సీబీఐ విచారణ జరిపి న్యాయం జరగాలని కోరుతున్నాం. న్యాయబద్ధంగా వ్యాపారం చేసుకుంటున్నవారి గురించి మేం మాట్లాడటం లేదు. డబ్బుంటే భూములు కొని వ్యాపారాలు చేసుకుంటే తప్పా అంటున్నారు. మీరు చేస్తున్న లూటీపై మాత్రమే మేం ప్రశ్నిస్తున్నాం.

ఆ వ్యాపారాల గురించి అడుగుతున్నాం. సమాధానం చెప్పండి. రాజధాని ప్రాంతంలో భూ దందా వాస్తవం అవునా?...కాదా?. రాజధాని ప్రకటన 3 నెలలకు ముందే ఎలా భూములు కొన్నారు. మీరు నంగనాచిలా మాట్లాడే రోజులు ఎప్పుడో పోయాయి.  అనంతపురం నుంచో నెల్లూరు నుంచో వెళ్లి రాజధాని ప్రాతంలో భూములు కొంటున్న వ్యక్తులు  13 జిల్లాల్లో ఎక్కడా కొనకుండా అక్కడే ఎందుకు కొనాల్సి వచ్చింది. అమాయక రైతులను భయపెట్టి భూములు లాక్కున్నారు.

భూములు లూటీపై న్యాయవిచారణకు మీరు సిద్ధమైనా? అసైన్డ్ భూములు కొనడం చట్ట విరుద్ధమని మీకు తెలియదా?. మీ ఆస్తుల ప్రకటన వెనుక ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. మీ ఆస్తులు, మీ బినామీల గురించి అన్ని బయటకు వస్తున్నాయి. ఒక మంత్రి తన భార్య పేరు మీద భూములు కొనడం మరీ తప్పు. వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలి. చంద్రబాబు మీ పనయిపోయింది. భూ లూటీ వెనక వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియాలి'....అని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.

No comments:

Post a Comment