Wednesday 2 April 2014

ఢిల్లీలోనూ చక్రం తిప్పాలి : చంద్రబాబు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, ఢిల్లీలోనూ చక్రం తిప్పాలి : చంద్రబాబు

Published at: 02-04-2014 16:55 PM
హైదరాబాద్, ఏప్రిల్ 2 : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు ఢిల్లీలోనూ తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పాలని అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. పార్టీలోకి కొత్తగా వచ్చేవారు ఐక్యంగా పనిచేయాలని ఆయన సూచించారు. మాజీ మంత్రులు పిన్నమనేని వెంకటేశ్వరరావు, మండలి బుద్ధప్రసాద్‌లు మంగళవారం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికలకు ఎందుకు భయపడిపోయారని వైసీపీని ఉద్దేశించి ప్రశ్నించారు. ఫలితాలు విడుదల అయితే వారి సత్తా ఏమిటో తేలిపోయేదని, అందుకే ఢిల్లీకి పోయి ఆపేందుకు ప్రయత్నించారని ఆయన ఎద్దేవా చేశారు.
వైసీపీకి నిజంగా ప్రజల్లో బలం ఉంటే మున్సిపల్ ఎన్నికలు ఆపాలని కోర్టుకు ఎందుకు వెళ్లిందని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. కొన్ని ఛానళ్లు నేరస్థుడికి వంత పాడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీమాంధ్రను సింగపూర్ తరహాలో అభివృద్ధి చేసే సత్తా ఒక్క టీడీపీకే ఉందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. చెప్పిన విధంగానే అధికారంలోకి రాగానే చేసి చూపిస్తానని ఆయన పేర్కొన్నారు. సచివాలయం ఎక్కడ ఉంటుందో తెలియని వాళ్లు రాజకీయాలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. చట్టం కొందరికి చుట్టం కాకూడదని ఆయన అన్నారు.

No comments:

Post a Comment