Thursday, 4 August 2016

ఆర్థిక సంఘం వద్దనలేదు!

ఆర్థిక సంఘం వద్దనలేదు!
04-08-2016 02:11:47

http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Aug/20160804/Hyderabad/636058735078960649.jpg
·         చైర్మనే నాకు చెప్పారు..
·         సభ్యుడూ అవునన్నారు
·         హోదా ఇవ్వొద్దనేది  సర్కారు నిర్ణయమే
·         జైట్లీ పక్కదోవ పట్టించారు: జైరామ్
·         సభలో కొనసాగిన వైసీపీ ఆందోళన
·         చీపుర్లు పట్టిన కాంగ్రెస్కార్యకర్తలు
·         కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసన
న్యూఢిల్లీ, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇచ్చేందుకు 14 ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదన్న కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ వాదనపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్సీనియర్నేత జైరామ్రమేశ్మండిపడ్డారు. హోదా ఇవ్వవద్దని ఆర్థిక సంఘం ఎక్కడా చెప్పలేదని, సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డే విషయం తనకు చెప్పారని ఆయన వెల్లడించారు. ప్రత్యేక హోదాను రద్దు చేయాలని సంఘం ఎక్కడా సిఫారసు చేయలేదని తేల్చిచెప్పారు. దీనిపై సంఘం సభ్యుడు అభిజిత్సేన్ను తాను సంప్రదించగా, ఆయన సైతం స్పష్టమైన వివరణ ఇచ్చారని తెలిపారు. కాంగ్రెస్ఎంపీ కేవీపీ రామచంద్రరావు నివాసంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు రాజ్యాంగం అడ్డువస్తోందని జైట్లీ చెప్పడాన్ని పచ్చి అబద్ధంగా అభివర్ణించారు.

అది తప్పుడు ప్రకటన అని, ఆయన పార్లమెంటును, దేశ ప్రజలను.. ముఖ్యంగా ఆంధ్రులను పక్కదోవ పట్టించారని మండిపడ్డారు. ఆర్థిక సంఘం సిఫారసులను, అభిజిత్సేన్పంపిన ఈమెయిల్వివరణను ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇదే అంశంపై తాను ఆర్థిక సంఘం అధ్యక్షుడు వైవీ రెడ్డితో కూడా మాట్లాడానని, ఆయన కూడా ప్రత్యేక హోదా ఇవ్వొద్దని తాము సిఫారసు చేయలేదని స్పష్టంచేశారన్నారు. పన్నుల పంపకాలు, రాషా్ట్రల వాటాలకు సంబంధించి మాత్రమే ఆర్థిక సంఘం సిఫారసులు చేసిందని చెప్పారు. ‘‘సంఘం సిఫారసుల్లో రెండు భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో కేంద్ర పన్నుల్లో రాషా్ట్రలకు ఎంత వాటా ఇవ్వాలి? అనేది ఉంటుంది. రెండో భాగంలో ఏయే రాషా్ట్రలకు ఎంతెంత మేరకు నిధులు ఇవ్వాలి? అనేది ఉంటుంది. క్రమంలో ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, లేని రాషా్ట్రల మధ్య పన్నుల పంపకాల్లో భేదం చూపొద్దని మాత్రమే ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది’’ అని జైరామ్వివరించారు.

సిఫారసులు అందే నాటికి దేశంలో 11 రాషా్ట్రలు ప్రత్యేక హోదాను అనుభవిస్తున్నాయని, అందులో 6 రాషా్ట్రల్లో కాంగ్రెస్ప్రభుత్వాలు ఉన్నాయని పేర్కొన్నారు. నేపథ్యంలోనే ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలకు పన్ను వాటాల కేటాయింపుల్లో భేదం చూపొద్దన్న సిఫారసును ప్రధాని మోదీ ఆమోదించారని ఆరోపించారు. అలాగే ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వొద్దన్న నిర్ణయం తీసుకున్నది కూడా మోదీ ప్రభుత్వమేనన్నారు. దీనిని ఆర్థిక సంఘంతో ముడిపెట్టడం సరికాదని తేల్చిచెప్పారు. తిరుపతిలో ఐఐటీ, తాడేపల్లిగూడెంలో ఎన్ఐటీల ఏర్పాటుకు సంబంధించిన చట్టం చేయటానికి కేంద్రానికి రెండేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు.

టీడీపీ.. తెలుగు డ్రామా పార్టీ
ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం తెలుగుదేశం పార్టీ పోరాటాలు చేయటం నాటకాలు ఆడటమేనని రమేశ్ఆరోపించారు. టీడీపీ అంటే.. తెలుగు డ్రామా పార్టీ అని ఆయన అభివర్ణించారు. బీజేపీయే కనుక ఏపీ పట్ల చిత్తశుద్ధితో ఉంటే తక్షణం ప్రత్యేక హోదాను అమలు చేయవచ్చునని చెప్పారు. ఇందుకు ఎలాంటి సాంకేతిక అడ్డంకులూ లేవన్నారు. రాజ్యసభలో జైట్లీ ప్రసంగించిన రోజున తన మామగారు చనిపోయారని, దీంతో తాను హఠాత్తుగా చెన్నై వెళ్లాల్సి వచ్చిందని ఆయన వివరించారు. విషయం తెలుసుకోకుండా తెలుగుదేశం పార్టీ ఎంపీలు తనను విమర్శించడం సరికాదన్నారు.

ఇదీ అభిజిత్ మెయిల్‌!
‘‘ప్రత్యేక కేటగిరీ హోదాను రద్దు చేయాలని 14 ఆర్థిక సంఘం సిఫారసు చేయలేదు. కేంద్ర పన్నుల్లో వాటాలు పంచేటప్పుడు ప్రత్యేక హోదా ఉన్న రాషా్ట్రలు, ప్రత్యేక హోదా లేని రాషా్ట్రల మధ్య భేదం చూపే సంప్రదాయాన్ని కొనసాగించరాదని మాత్రమే సంఘం నిర్ణయించింది. ప్రణాళిక, ప్రణాళికేతర గ్రాంట్ల విషయంలో వేర్వేరు కేటాయింపులు కొనసాగించేందుకు కేంద్రానికి పూర్తి స్వేచ్ఛ ఉంది’’
-
జైరామ్రమేశ్కు పంపిన మెయిల్లో ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్సేన్‌ 


NITI Aayog

NITI Aayog
The NITI Aayog comprises the following:
1.  Prime Minister of India as the Chairperson
2.  A Governing Council composed of Chief Ministers of all the States and Union territories with Legislatures and lieutenant governors of other Union Territories.
3.  Regional Councils composed of Chief Ministers of States and Lt. Governors of Union Territories in the region to address specific issues and contingencies impacting more than one state or a region.
4.  Full-time organizational framework composed of a Vice-Chairperson, three full-time members, two part-time members (from leading universities, research organizations and other relevant institutions in an ex-officio capacity), four ex-officio members of the Union Council of Ministers, a Chief Executive Officer (with the rank of Secretary to the Government of India) who looks after administration, and a secretariat.
5.  Experts and specialists in various fields [2]
With Prime Minister Narendra Modi as the Chairperson, the committee consists of
1.  Vice Chairperson: Arvind Panagariya [3]
2.  Ex-Officio Members: Rajnath SinghArun JaitleySuresh Prabhu and Radha Mohan Singh
3.  Special Invitees: Nitin GadkariSmriti Zubin Irani and Thawar Chand Gehlot
4.  Full-time Members: Bibek Debroy (Economist),[4] V. K. Saraswat (former DRDOChief) and Ramesh Chand (Agriculture Expert)[5]
5.  Chief Executive Officer:Amitabh Kant[6]
Governing Council: All Chief Ministers and Lieutenant Governors of States and Union Territories



Bihar toppers scam: Intermediate exam board chief quits

Bihar toppers scam: Intermediate exam board chief quits, 5 detained
India Today has discovered that while answer sheets from all other schools in Vaishali district were sent to Kaimur and Ara for evaluation, only the ones from Bishun Rai College were sent to Patna's Boys' High School.


IndiaToday.in  | Posted by Nivedita Dash
Patna, June 8, 2016 | UPDATED 15:55 IST
A +A -
Arts topper Ruby RaiRuby Rai, the Arts topper who skipped the re-examination, has been given another chance to appear for the re-examination on June 11.
BRIEFCASE
1Police summons parents of tainted Bihar toppers.
2India Today has discovered that while answer sheets from all other schools
3Lalu Prasad has distanced himself from Baccha Rai.
The chairman of the Bihar Secondary Examination Board Lalkeshwar Singh today resigned from his post shortly after the Nitish Kumar government issued a show cause notice against him over the controversy surrounding the state's dubious Intermediate examination toppers, who have been found to be clueless about their subjects.

Here are the latest developments:
The Bihar government had sought Singh's resignation yesterday, but he refused to do so initially.
A show cause notice was then issued against Singh this morning, forcing him to quit his post.
Meanwhile, India Today has discovered that while answer sheets from all other schools in Vaishali district were sent to Kaimur and Ara for evaluation, only the ones from Bishun Rai College were sent to Patna's Boys' High School.
The Arts and Science toppers in the Plus Two exam - Ruby Rai and Saurav Shrestha respectively - had taken their examination at Bishun Rai College.
The Special Investigation Team probing the topper scam yesterday raided the school where the answersheets of the candidates from Bishun Rai College are kept.
The prinicipal of the school, according to sources, has claimed that seal of the envelope in which answersheets of Bishun Rai College was sent to him was already broken.
Five people, including the principal of the GA Inter College, which was the examination center for Bishun Rai College students, have been detained and being interrogated.
The centre superintendent of Patna Boys' High school Viseshwar Yadav has also deen detained by the SIT.
An FIR has been filed against Science toppers Saurabh Sreshtha, third topper Rahul Kumar and Arts topper Ruby Rai - all students of Bishun Rai College.
The BSEB last week cancelled the results of the first and third toppers in the Science stream as both failed in their re-test, but decided to give another chance to the Arts topper to appear for a re-test on June 11.
 Day after raid on Bihar Board, police summon 'tainted' toppers




ఇంటర్ టాపర్స్ స్కామ్లో.. మరో ర్యాంకర్ అరెస్ట్
04-08-2016 17:14:28
http://cdn3.andhrajyothy.com/AJNewsImages/2016/Aug/20160804/Hyderabad/636059276682530441.jpg
పాట్నాబీహార్లో సంచలనం రేపిన ఇంటర్ టాపర్స్ స్కామ్లో మరో విద్యార్థిని ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది. సైన్స్లో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్ను అతడి బంధువుల ఇంట్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానిక కోర్టులో ప్రవేశపెట్టి కస్టడీకి తరలించారు.  ఇంటర్ పరీక్షల్లో సైన్స్ విభాగంలో మూడో ర్యాంకు సాధించిన రాహుల్ కుమార్ను టీవీ ఛానల్ ఇంటర్వూ చేయగా అతడి ప్రతిభ ఏంటో బయటపడింది.

పలువురు టాపర్స్ కూడా పొంతనలేని సమాధానాలు చెప్పడంతో కుంభకోణం వెలుగుచూసింది. బిషున్ రాయ్ కాలేజీకి చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో టాపర్స్గా రాణించడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం రాహుల్ను ప్రశ్నించగా ర్యాంకు కోసం 5 లక్షల డబ్బులు లంచంగా ఇచ్చినట్లు అంగీకరించాడు. కేసులో బీహార్ ఇంటర్ బోర్డు అధికారి, ఆయన భార్య, కాలేజీ నిర్వాహకులతో పాటు పలువురు అరెస్ట్ అయ్యారు.







Friday, 8 July 2016

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం

పవిత్ర సంగమ ప్రాంతంలో..దుర్గమ్మ నమూనా ఆలయం
08-07-2016 07:06:50

(ఆంధ్రజ్యోతి, విజయవాడ)
కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పుష్కరాలకు విచ్చేసే భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా ఒక నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని, ఈ ఆలయాన్ని కృష్ణవేణికి నిత్య నవహారతులిచ్చే పవిత్ర సంగమ ప్రాంతంలోనే ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను ఆదేశించారు. దుర్గగుడిలో జరిగే పూజా కార్యక్రమాలు, హారతలు నమూనా ఆలయంలో కూడా జరిగేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు.

భక్తులకు సౌకర్యంగా..
పుష్కరాలకు విచ్చేసే పుష్కర యాత్రికులు రోజుకు పది లక్షలకు పైగా ఉంటారని, సెలవు దినాలయితే ఈ సంఖ్య 25 లక్షలు దాటుతుందని ప్రభుత్వ అధికారుల అంచనా. అన్ని లక్షల మంది భక్తులకు దుర్గమ్మ దర్శనం దుర్లభమని అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. అటువంటి సమస్య తలెత్తకుండా సంగమ ప్రాంతంలో కనకదుర్గమ్మ నమూనా ఆలయాన్ని ఏర్పాటు చేయాలని దేవాదాయ ధర్మాదాయ శాఖాధికారులను సీఎం ఆదేశించారు. నమూనా ఆలయంలో కూడా పూజాదికాలు దుర్గగుడి అర్చకుల ఆధ్వర్యంలో జరగుతాయి. భక్తులకు ఉచిత ప్రసాద పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి విచ్చేసే భక్తులు ఇంటికి ప్రసాదాన్ని తీసుకువెళ్లేందుకు వీలుగా పంచ పదార్థాల మిశ్రమం భవానీ ప్రసాదం, లడ్డు ప్రసాదాన్ని అందుబాటులో ఉంచుతారు. వీటితో పాటు అమ్మవారి ఉచిత కుంకుమ ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నమూనా ఆలయం చుట్టూ గ్రీనరీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గమ్మను ప్రతి రోజూ లక్ష మంది దర్శించుకునేలా తగిన చర్యలు తీసుకోవాలని దుర్గగుడి అధికారులను సీఎం ఆదేశించారు.

పీఠాధిపతులకు ప్రత్యేక ఆహ్వానం
పవిత్ర పుష్కరాలను వైదిక సంప్రదాయాల ప్రకారం నిర్వహించాలని, నిర్వహణపై పీఠాధిపతులతోనూ, స్వామిజీలతోనూ సంప్రదించి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీ వేయాలని కొంత కాలంగా పలువురు పీఠాధిపతులు డిమాండు చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పుష్కరాల సందర్భంగా పవిత్ర సంగమ ప్రాంతంలో కృష్ణవేణికి ప్రతి రోజూ నిర్వహించే నిత్య నవ హారతలకు అన్ని పీఠాలకు సంబంధించిన పీఠాధిపతులను, స్వామిజీలను ఆహ్వానించాలని సీఎం సంకల్పించారు.

సంగమ ప్రాంతంలో
సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఆధ్మాత్మికతతో పాటు తెలుగు సంస్కృతి, కళా వైభవాలను చాటి చెప్పేందుకు సంగమ ప్రాంతంలో తెలుగు సాంస్కృతిక వైభవ కళావేదికను ఏర్పాటు చేయనున్నారు. ఈ వేదికపై ప్రతిరోజూ ఉదయం నుంచి రాత్రి వరకు జానపద, చారిత్రక, పౌరాణిక నాటకాలతో పాటు తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన ప్రముఖలపై చిత్ర మాలికను ప్రదర్శించనున్నారు. ఈ కళావేదిక నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వ భాషా- సాంస్కృతిక శాఖకు అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో పాటు అందరినీ ఆకట్టుకునేలా సప్తవర్ణాల లేజర్‌ షోను ప్రతి రోజూ రాత్రి వేళల్లో ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..

ప్రాజెక్టుల వివాదంలో దేవినేని కంటే హరీష్ ప్రజంటేషన్‌కే మార్కులంట..
08-07-2016 08:42:10



ఢిల్లీలో ఏపీ కంటే తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారా? రాష్ట్రానికి సంబంధించిన రాయబారాలను తెలంగాణ నేతలు నడిపినంత వేగంగా ఏపీ నేతలు చక్కబెట్టలేకపోతున్నారా? హస్తినలో తెలంగాణ నేతలకు ఉన్న అడ్వాంటేజ్ ఏమిటి? ఏ విషయంలో తెలంగాణ నేతలతో తాము పోటీ పడలేకపోతున్నామని ఏపీ నేతలు మధనపడుతున్నారు? వీటి కధనమేమిటో చూద్దాం.

ఆంధ్రప్రదేశ్‌ నేతలకు పెద్ద చిక్కొచ్చి పడింది. ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టడంలో తమ కంటే తెలంగాణ నేతలు ఫాస్ట్ గా ఉన్నారని వారు భావిస్తున్నారు. ఒక పని కోసం తాము పది సార్లు తిరిగినా కానిది, తెలంగాణ నేతలు రెండు సార్లు తిరిగితే అయిపోతున్నదట..! అలా కావడం పట్ల వారేమీ ఈర్ష్య చెందడం లేదట! కాకపోతే తమ పని కావడం లేదన్న బాధ మాత్రం ఉందట...! ఇంతకీ ఈ సమస్యకు మూలం ఏమిటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నాం... భాష! ఆశ్చర్య పోకండి. అవును...ఆంధ్రప్రదేశ్‌ నేతలు ఢిల్లీలో లాంగ్వేజ్ ప్రాబ్లం ఎదుర్కొంటున్నారట. ఈ విషయాన్ని ఏపీ తెలుగుదేశం పార్టీ నేతలే చెబుతున్నారు. ఢిల్లీలో తమకు మహా చిక్కొచ్చి పడిందంటున్నారు వారు. చంద్రబాబు కేబినెట్ మంత్రులు, టీడీపీ ఎంపీలలో చాలా మందికి హిందీ రాదు. వచ్చిన వారికి అరకొరనే. ఢిల్లీలో తమ రాష్ట్రానికి రావాల్సిన అంశాల పై అక్కడ అధికారులకు సరైన ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారట వారు. వచ్చీ రాని భాషలో చేసే కమ్యూనికేషన్ ఢిల్లీ అధికారులను ఆకట్టుకోలేకపోతోందని ఓ సీనియర్ నేత వాపోయారు. ఈ విషయంలో తెలంగాణ నేతలు అడ్వాన్స్ గా ఉన్నారని సదరు నేత చెప్పుకొచ్చారు.

           దీనికి కొన్ని ఉదాహరణలు సైతం వివరించారు. ఏపీకి చట్ట ప్రకారం రావాల్సిన చాలా ప్రాజెక్టులు, నిధుల విషయంలో ఒకటికి పది సార్లు తిరుగుతున్నా ఆశించిన స్థాయిలో ఫలితం దక్కడం లేదట. ఉదాహరణకు... రాష్ట్రం ఏర్పడి రెండేళ్లయినా ఇంత వరకు లోటు తీర్చ లేదని చెబుతున్నారు. చంద్రబాబు ఇరవై సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగినా తిప్పి కొడితే మూడు వేల కోట్లకు మించి రాలేదని గుర్తు చేస్తున్నారు. పోలవరం విషయంలో సేమ్ టు సేమ్ అంటున్నారు. రాజధాని నిధుల విషయంలోను సంతృప్తికర స్థాయిలో అందలేదనే చెబుతున్నారు. రైల్వే జోన్ గురించి చెప్పనక్కర లేదు. ఇవన్నీ చట్టంలో ఉన్న అంశాలే. అయినా, పెద్దగా ఫలితం లేని పరిస్థితి అంటున్నారు వారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే... ఆ మధ్య నీతి అయోగ్ సభ్యులు తెలంగాణలో పర్యటించారు. మిషన్ కాకతీయ పథకాన్ని పరిశీలించారు. దీని కోసం మూడు వేల కోట్లు ఇవ్వాల్సిందిగా నీతి అయోగ్ ను తెలంగాణ సర్కారు కోరిందట. అడిగిందే తడవుగా రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా కేంద్రానికి నీతి అయోగ్ రికమండ్ చేసిందట. వెనకబడిన జిల్లాల కోసం మరో నాలుగు వందల కోట్లు ఇచ్చారట. మరో నాలుగు వందల కోట్లు ఇవ్వాల్సిందిగా తెలంగాణ సర్కారు కోరిందట. దానికి సానుకూలంగా స్పందించినట్టు చెబుతున్నారు.
 
                ఇక సాగునీటి ప్రాజెక్టుల వివాదం విషయంలో ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు ఇటీవల ఢిల్లీ వెళ్లారు. అక్కడ ఉమ్మడి సమావేశాలు జరిగాయి. అందులో హరీష్ రావు ఇచ్చినంత చక్కటి ప్రజెంటేషన్, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా ఇవ్వలేక పోయారట! అదే మంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అంటున్నారు. ఢిల్లీలో పెద్ద స్థాయి అధికారుల్లో మెజారిటీ హిందీ వారే కావడం తమకు ఇబ్బందిగా ఉందని ఏపీ నేతలు వాపోతున్నారు. మెజారిటీ తెలంగాణ నేతలకు హిందీ భాష పై పట్టుంది. వారు ఏ అధికారి వద్దకు వెళ్లినా తాము చెప్పదలచుకుంది సూటిగా, స్పష్టంగా చెబుతున్నారట. ఏపీ నేతల పరిస్థితి దీనికి రివర్స్. దీంతో తెలంగాణ నేతలతో ఢిల్లీ అధికారులు కనెక్ట్ అవుతున్నారు. ఏపీ వాళ్లను కొంత మేర పరాయి వారిగా చూస్తున్నారట. దీనిపై ఓ సీనియర్ నేత ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడిగా ఉన్నప్పుడు ఈ సమస్య లేదని చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు చెప్పి, తమ ముఖ్య నేతలకు హిందీ క్లాసులు పెట్టిస్తే బాగుంటుందని సదరు నేత అభిప్రాయపడ్డారు. మరి ఈ ప్రతిపాదనకు చంద్రబాబు ఏమంటారో!