Monday, 12 October 2015

The Liver & Blood Sugar

The Liver & Blood Sugar

  • http://dtc.ucsf.edu/types-of-diabetes/type1/understanding-type-1-diabetes/how-the-body-processes-sugar/the-liver-blood-sugar/





  • Controlling Blood Sugar
During a meal, your liver stores sugar for later.
The liver both stores and produces sugar…
The liver makes sugar when you need it….
Gluconeogenesis? Glycogenolysis? Ketogenesis? What are they? 

You need to know.
Self-assessment Quiz
grains, sugar, scale
When you’re not eating, the liver supplies sugar by turning glycogen into glucose in a process called glycogenolysis.
The liver acts as the body’s glucose (or fuel) reservoir, and helps to keep your circulating blood sugar levels and other body fuels steady and constant. The liver both stores and manufactures glucose depending upon the body’s need. The need to store or release glucose is primarily signaled by the hormones insulin and glucagon.
During a meal, your liver will store sugar, or glucose, as glycogen for a later time when your body needs it. The high levels of insulin and suppressed levels of glucagon during a meal promote the storage of glucose as glycogen.
When you’re not eating – especially overnight or between meals, the body has to make its own sugar. The liver supplies sugar or glucose by turning glycogen into glucose in a process called glycogenolysis.The liver also can manufacture necessary sugar or glucose by harvesting amino acids, waste products and fat byproducts. This process is called gluconeogenesis.
Glucose production by the liver during fasting conditions
The liver also makes another fuel, ketones, when sugar is in short supply….
When your body’s glycogen storage is running low, the body starts to conserve the sugar supplies for the organs that always require sugar. These include: the brain, red blood cells and parts of the kidney. To supplement the limited sugar supply, the liver makes alternative fuels called ketones from fats. This process is calledketogenesis. The hormone signal for ketogenesis to begin is a low level of insulin. Ketones are burned as fuel by muscle and other body organs. And the sugar is saved for the organs that need it.
Ketone  production by the liver during fasting conditions
The terms “gluconeogenesis, glycogenolysis and ketogenesis” may seem like complicated concepts or words on a biology test. Take a moment to review the definitions and illustrations above. When you have diabetes, these processes can be thrown off balance, and if you fully understand what is happening, you can take steps to fix the problem.
Self assessment quizzes are available for topics covered in this website. To find out how much you have learned about  Facts about Diabetes, take our self assessment quiz when you have completed this section.  The quiz is multiple choice. Please choose the single best answer to each question. At the end of the quiz, your score will display. If your score is over 70% correct, you are doing very well. If your score is less than 70%, you can return to this section and review the information.

59 నుంచి 83కు ఎలా చేరింది?.. జగన్‌ షుగర్‌ స్థాయిపై మంత్రి కామినేని డౌట్‌

59 నుంచి 83కు ఎలా చేరింది?.. జగన్‌ షుగర్‌ స్థాయిపై మంత్రి కామినేని డౌట్‌ 
Updated :12-10-2015 01:06:46
ఉనికి కోసమే జగన్‌ దీక్ష: పల్లె 
పండుగ రోజుల్లో దీక్షలా: రేణుక 
 
గుంటూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): ‘‘నిరవధిక దీక్ష చేస్తున్న ప్రతిపక్ష నేత జగన్‌ షుగర్‌ స్థాయి ఆదివారం ఉదయం 11 గంటలకు 59కి పడిపోయింది. అయితే మధ్యాహ్నం మూడు గంటల తరువాత షుగర్‌ స్థాయి 83కు చేరింది. ఇది ఎలా సాధ్యమో వైద్యుడిగా నాకే అర్ధం కావడం లేదు’’ అని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అనుమానం వ్యక్తం చేశారు. గుంటూరు ఆర్‌ అండ్‌ బీ అతిథి గృహంలో ఆదివారం జగన్‌ ఆరోగ్య పరిస్థితి, వైద్యులు ఇచ్చిన నివేదికను ఆయన విలేకరులకు వివరించారు. జగన్‌ దీక్ష ప్రారంభించిన మొదటి రెండు రోజులు రోజుకు రెండు సార్లు షుగర్‌ పరీక్షలు చేశామని.. తర్వాత మూడు సార్లు చేశామని చెప్పారు. జగన్‌ ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు హెల్త్‌బులిటెన్‌ విడుదల చేస్తామని మంత్రి చెప్పారు. దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నించడం లేదని పేర్కొన్నారు. ‘‘జగన్‌ షుగర్‌ స్థాయి 91 - 85, 97 - 88, 87 - 82 గా నమోదవుతుంది. ఆదివారం వరకు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది’’ అని చెప్పారు. జగన్‌ ఆరోగ్యంపై సీఎ చంద్రబాబు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారని కామినేని చెప్పారు. జగన్‌ దీక్ష, ఆరోగ్య పరిస్థితిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు మంత్రి కామినేని తెలిపారు. కాగా, రాజకీయ ఉనికి కోసమే జగన్‌ దీక్ష చేస్తున్నారని రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పల్లె రఘునాధ్‌రెడ్డి విమర్శించారు. ఆదివారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా మారడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘భోగాపురం ఎయిర్‌పోర్టు వస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందడాన్ని జగన్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. బందరు పోర్టుతో వేలాది మందికి ఉపాధి లభించడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. రాయలసీమలో పుట్టి సీమకు సాగు, తాగునీరు వచ్చే పట్టిసీమను అడ్డుకుంటున్న జగన్‌ వైఖరిని సీమ ప్రజలు అసహ్యించుకుంటున్నారు’’ అని ధ్వజమెత్తారు. వైఎస్‌ హయాంలో 110 సెజ్‌లకు 5 లక్షలు ఎకరాలు దానం చేస్తే... జగన్‌ కమీషన్లు వసూలు చేసుకుంటూ కూర్చున్నారని విమర్శించారు. ఇక.. వైసీపీ అధినేత జగన్‌ హిందూ సంప్రదాయ పండుగలను అవమానించేలా ఆ రోజునే దీక్షలు, బంద్‌లు చేపడతున్నారని టీడీపీ అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక మండిపడ్డారు. గతంలో రాఖీ పండుగ రోజున ధర్నా తలపెట్టిన జగన్‌... వినాయక నిమజ్జనం, దసరా పండుగ రోజుల్లో ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా దీక్షలు, బంద్‌లు తలపెడతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఆదివారం ఎన్టీఆర్‌భవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ... యువత ‘ఫ్యాన్‌’ గాలి మాయలో పడొద్దని హితువు పలికారు. ‘‘రాష్ట్ర ప్రయోజనాల పట్ల జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్‌లో ఉన్న 231 ఉమ్మడి సంస్థల్లో జగన్‌ చీకటి మిత్రుడు కేసీఆర్‌ కబ్జాను నివారించి రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగే చర్చలు ఎందుకు చేపట్టలేదు’’ అని ప్రశ్నించారు.

హెచ్చుతగ్గులు సాధారణమే - జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ 
ఐదు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్న జగన్‌ రక్తంలో ఎటువంటి కీటోన్స్‌ గుర్తించలేదని జీజీహెచ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఉదయకుమార్‌ తెలిపారు. జగన్‌ షుగర్‌ లెవల్స్‌ పెరుగుదలపై వచ్చిన విమర్శలపై వైసీపీ నేతలు ఆదివారం సాయంత్రం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల వివరణ కోరారు. దీనిపై ఉదయకుమార్‌ వివరణ ఇచ్చారు. ఏడు గంటల సమయంలో పరీక్ష నిర్వహించినప్పుడు సాధారణ పద్ధతుల్లో ఉపయోగించినట్లుగా గ్లూకోమీటర్‌ను ఉపయోగించలేదని ఆయన తెలిపారు. రక్తం నమూనాను జగన్‌ గుండెకు రక్తాన్ని తీసుకొచ్చే రక్త నాళాల నుంచి కాకుండా గుండె నుంచి వచ్చే రక్త నాళాల నుంచి రక్తం సేకరించారని.. దీని వల్ల షుగర్‌ లెవెల్స్‌లో 10 శాతం మార్పులుండవచ్చన్నారు. అంతే కాకుండా రక్త నమూనాను దీక్షా శిబిరం నుంచి పరీక్షా కేంద్రం వరకు తీసుకు రావడానికి గంటన్నరకు పైగా సమయం పట్టిందన్నారు. ఈ సమయంలో రక్తకణాలు గ్లూకోస్‌ ను తీసుకోవడం వల్ల కూడా గ్లూకోస్‌ శాతం తగ్గవచ్చన్నారు. అంతేతప్ప వైద్యులలో ఎలాంటి నిర్లక్ష్యమూ లేదన్నారు. దీనిపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ముగ్గురు ఫిజీషియన్లను పరీక్షల కోసం పంపుతున్నట్లు తెలిపారు. కాగా, దీక్ష ప్రారంభమైనప్పటి నుంచీ నివేదికలు కావాలని బొత్స కోరారు.

Saturday, 10 October 2015

నడిరోడ్డుపై నగ్నత్వం!

నడిరోడ్డుపై నగ్నత్వం!
Updated :10-10-2015 01:43:14
  • పోలీసులే విప్పారన్న బాధితులు
  • కాదు వారే విప్పుకొన్నారన్న పోలీసులు
  • గ్రేటర్‌ నోయిడాలో ఘటన

న్యూఢిల్లీ, అక్టోబరు 9: తమ ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లిన దళిత దంపతుల పట్ల పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. నడివీధిలో వారి దుస్తులు విప్పి నగ్నంగా చేసి ఈడ్చిపారేశారు. గ్రేటర్‌ నోయిడా(ఉత్తర్‌ప్రదేశ్‌)లోని గౌతమ్‌బుద్ధ్‌ నగర్‌ ప్రాంతంలో గురువారం జరిగిందీ ఘటన. నోయిడాలోని అట్టా ప్రాంతంలో నివసించే సునీల్‌ గౌతమ్‌ అనే దళితుడి ఇంట్లో బుధవారం రాత్రి దొంగలు పడ్డారు. దీంతో అతడు ఫిర్యాదు చేసేందుకు గురువారం దాంకౌ ర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తన భార్యతో సహా వెళ్లాడు.
 
కానీ, స్టేషన్‌ అధికారి ప్రవీణ్‌కుమార్‌ యాదవ్‌ తమ ఫిర్యాదు తీసుకోవడానికి నిరాకరించడంతో.. స్టేషన్‌ బయట తాను తన కుటుంబసభ్యులతో సహా నిరసనకు దిగామని, అసహనానికి గురైన పోలీసులు తమను కొట్టి తమ దుస్తులను చించేసి ఈడ్చేశారని సునీల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అయితే.. సునీల్‌ కుటుంబసభ్యులు తమంత తామే దుస్తులు విప్పుకొని నిరసన తెలిపే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారని మరికొందరు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఈ ఘటన మొత్తాన్నీ తన మొబైల్‌లో చిత్రీకరించి ఆన్‌లైన్‌లో పెట్టడంతో.. పోలీసుల వైఖరిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటన అనంతరం పోలీసులు ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్టు, వారిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టు స్థానిక పత్రిక ఒకటి వెల్లడించింది. పోలీసులు అరెస్టు చేసినవారిలో సునీల్‌ దంపతులు కూడా ఉన్నట్టు సమాచారం. కాగా.. ఈ ఘటనపై యూపీ సర్కారు అధికారిక ట్విటర్‌ ఖాతా ద్వారా స్పందించింది. జరిగిన ఘటన తాలూకూ వీడియో పోలీసుల వద్ద ఉందని.. సునీల్‌ గౌతమ్‌ దంపతులు తమంత తామే దుస్తులు విప్పుకొన్నట్టుగా వీడియోలో స్పష్టంగా ఉందని పేర్కొంది.

Wednesday, 7 October 2015

బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది - జగన్

బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుంది

Sakshi | Updated: October 07, 2015 15:50 (IST)
బాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజొస్తుందివీడియోకి క్లిక్ చేయండి
గుంటూరు : చంద్రబాబు పాలనను బంగాళాఖాతంలో కలిపే రోజు వస్తుందని, ఈయన పాలనకు చరమగీతం పలికే రోజు రావాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం గుంటూరు సమీపంలోని నల్లపాడు రోడ్డులో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన శిబిరంలో బుధవారం మధ్యాహ్నం ఆయన నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనేమన్నారంటే...

గుంటూర్.. ఈవాళ ఈ నిరవధిక దీక్షకు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న ఈ పోరాటంలో సంఘీభావం తెలిపేందుకు తోడుగా మేమంతా ఉన్నామంటూ సంకేతాలివ్వడం కోసం కష్టం అనిపించినా, ఎండను కూడా ఖాతరు చేయకుండా, దూరాలు లెక్క చేయకుండా, చెరగని చిరునవ్వులతో ఆప్యాయత చూపిస్తున్న ప్రతి అక్కకు, చెల్లెమ్మకు, అవ్వకు, తాతకు, ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి, మీ అందరి ఆప్యాయతలు, ప్రేమానురాగాలకు చేతులు జోడించి శిరస్సు వంచి పేరు పేరునా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
  • ఈవాళ ప్రత్యేక హోదా విషయంగా నిరవధిక దీక్షలు చేస్తున్నాం. ఇంతకన్నా ముందు అందరం కలసికట్టుగా రాష్ట్రంలో బంద్ చేశాం
  • అసెంబ్లీలో సైతం కేంద్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశాం
  • మంగళగిరిలో దీక్ష చేశాం.. ఢిల్లీ వరకు ఈ పోరాటాన్ని తీసుకెళ్లాం. ఢిల్లీ వాళ్లకు అర్థం కావాలని అక్కడ సైతం దీక్షలు చేశాం. అయినా ఏ ఒక్కరికీ బుద్ధి రాలేదు.
  • చివరకు ఈ పోరాటం కొనసాగింపులో భాగంగా గుంటూరులో నిరవధిక నిరాహార దీక్ష ఈరోజు ప్రారంభించాం.
  • ఇప్పటికైనా చంద్రబాబుకు ఏం జరుగుతోందో తెలిసి వస్తుందని, ఆయన మనసు మారుతుందని, ఆయన మీద ఒత్తిడి తెస్తే.. ఆయన కేంద్రం మీద ఒత్తిడి తెస్తారని అప్పుడైనా మనకు ప్రత్యేక హోదా ఇస్తారన్న ఆశ.
  • ఈవాళ ప్రత్యేక హోదా కోసం మనమంతా పోరాడుతున్నాం. ఒక్కోసారి నాకు అర్థం కాదు. చంద్రబాబుకు ఈ విషయం తెలిసినా, ఆయన ఎన్నికలకు ముందు ఒక మాట మాట్లాడుతున్నారు, తర్వాత ప్లేటు ఎందుకు మారుస్తున్నారో తెలియట్లేదు
  • అప్పుడు ఐదు కాదు, పదేళ్లు హోదా ఉండాలన్నారు. ప్రత్యేక హోదా ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మీటింగులలో చెప్పారు
  • రాష్ట్రాన్ని విడగొట్టద్దని కోరితే వినలేదు
  • ఆరోజు పార్లమెంటులో ఏంజరిగిందో గుర్తు తెచ్చుకుంటే.. అడ్డగోలుగా విడగొట్టారు
  • నాటి ప్రధాని పార్లమెంటులో మైకు పట్టుకుని, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొడుతున్నాం, మీకు జరిగిన అన్యాయానికి పరిహారంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు
  • హైదరాబాద్ లాంటి నగరం మనకు లేకపోతే.. చదువుకున్న ప్రతి పిల్లాడు పట్టాతో ఉద్యోగం కోసం వెళ్లేది హైదరాబాద్ నగరానికే అని అందరికీ తెలుసు
  • 95 శాతం సాఫ్ట్ వేర్ పరిశ్రమలన్నీ హైదరాబాద్ లోనే ఉన్నాయని అందరికీ తెలుసు
  • ఇలాంటి అన్యాయం జరుగుతోంది, జరగబోతోందని.. దానికోసం ప్రత్యేక హోదాతో ఈ అన్యాయాన్ని పూడుస్తామన్నారు
  • ఆరోజు ప్రధాని ఆ హామీ ఇస్తే, ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ, బాబు ఐదు కాదు.. పదేళ్లు చేస్తామన్నారు
  • చివరకు ఇద్దరూ కలిసి అడ్డగోలుగా రాష్ట్రాన్ని విడగొట్టారు.
  • ఎన్నికలకు వెళ్లారు.. ఎన్నికల్లో మేనిఫెస్టోలు కూడా తయారుచేశారు. అందులో కూడా పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని పెట్టారు
  • ఏ టీవీలో చూసినా అదే ప్రకటన కనిపించేది
  • అంతటితో ఆగలేదు..ఇంటింటికీ పాంప్లెట్లు తీసుకెళ్లారు. ఏ టీవీ ఆన్ చేసినా జాబు కావాలంటే బాబు సీఎం కావాలని వినిపించేది
  • ఒకవేళ జాబ్ ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2 వేల భృతి ఇస్తామన్నారు. రాష్ట్రంలో 1.75 కోట్ల ఇళ్లున్నాయి.
  • బాబుకు సీఎం జాబ్ వచ్చింది.. మాకేమో ఉన్న జాబులు కూడా పీకేస్తున్నారని ప్రతి ఒక్కరూ అడుగుతున్నారు
  • బాబు ముఖ్యమంత్రి అయ్యారు.. ఒక్క కొత్త ఉద్యోగమూ ఇవ్వలేదు, ఉన్నవి ఊడబీకుతున్నారు
  • రాష్ట్రంలో లక్షకు పైగా ఉద్యోగాలున్నాయని విభజించేటప్పుడు లెక్క చూపించారు.
  • డీఎస్సీ పరీక్షలు రాసి ఏడాది దాటినా ఇంతవరకు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలేదు.
  • పైగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న స్కూళ్లను, హాస్టళ్లను తగ్గించేస్తున్నారు.
  • మిగులు ఉద్యోగాలు వేల సంఖ్యలో ఉన్నాయని చెబుతున్నారు.. అంటే, డీఎస్సీ పరీక్షలు రాసిన పిల్లలకు ఎగనామం పెడతామన్న సంకేతాలిస్తున్నారు
  • ఏపీపీఎస్సీ పరీక్షలు ఎప్పుడు పెడతారోనని పిల్లలు ఎదురుచూస్తున్నారు.
  • వాటికోసం జిల్లాల నుంచి పెద్ద ఊళ్లకు వచ్చి, అక్కడ కష్టం అనిపించినా బాడుగకు ఇళ్లు తీసుకుని కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఏళ్ల తరబడి కోచింగులు తీసుకుంటున్నారు
  • ఇంతవరకు ఆ పిల్లలకు ఏపీపీఎస్సీ పరీక్షలు పెట్టలేదు, నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కనీసం క్యాలెండర్ కూడా ప్రకటించలేదు
  • కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన చేస్తున్న వాళ్ల ఉద్యోగాలు లెఫ్ట్, రైట్, సెంటర్ ... ఇలా ఊడబెరుకుతున్నారు
  • 30 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, 30 వేల మంది ఆదర్శ రైతులను ఇప్పటికే పీకేశారు. మిగిలినవాళ్లు కూడా బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు
  • 40 వేల మంది సంఘమిత్రలు ఉన్నారు.. బాబు సీఎం కాకముందు వాళ్లు రెగ్యులరైజ్ అవుతారనుకున్నారు. అంతకుముందు 4 వేలు వచ్చేది.. దాన్ని 2 వేలకు కోసేశారు
  • పిల్లలు ఉద్యోగాలు దొరక్క, చదివే పిల్లలు కూడా భవిష్యత్తు కోసం సతమతం అవుతున్నారు
  • దాదాపు మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావేమోనని, చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకురాడేమో అని భయంతో బెంగతో రాష్ట్రంలో ఐదుగురు చనిపోయారు. నెల్లూరులో లక్ష్మయ్య, తిరుపతిలో కోటి, లోకేశ్వరరావు కర్నూలులో, రామయ్య నెల్లూరులో.. ప్రాణాలు కోల్పోయారు.
  • అసలు ప్రత్యేక హోదా అంటే ఏంటి, దానివల్ల కలిగే మేలేంటో చంద్రబాబుకు బాగా తెలుసు. ఆయన మంత్రులకు, ఎమ్మెల్యేలకు తెలుసో, తెలియదో నాకు తెలీదు.
  • తెలిసి ఉంటే చంద్రబాబు కాలర్ ఎందుకు పట్టుకోలేదని అడుగుతున్నాను
  • ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దానివల్ల ప్రధానంగా రెండు మంచి కార్యక్రమాలు జరుగుతాయి
  • ఒకటి.. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధుల్లో 90 శాతం గ్రాంటుగా ఇస్తారు. 10 శాతం మాత్రమే రుణం అవుతుంది.
  • ప్రత్యేక హోదా లేకపోతే గ్రాంటు 30 శాతమే అవుతుంది, రుణం 70 శాతం అవుతుంది. దానివల్ల రాష్ట్రానికి అప్పులు తగ్గుతాయి. ఇవన్నీ వాళ్లకు తెలుసు.
  • చట్ట ప్రకారం మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెట్రోరైళ్లు, ఇంకా రకరకాల సంస్థలు కట్టిస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేస్తామన్నారు.
  • హంద్రీ నీవా, గాలేరు- నగరి, వెలిగొండ అన్నీ చట్టంలో పెట్టారు.
  • ఈ మూడు నాలుగు ప్రాజెక్టులకే కనీసం 10వేల కోట్లవుతుంది. చట్టంలో పెట్టారు కదా అని ఏఐబీపీలో పెట్టిస్తే.. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రానికి ఇందులో 90 శాతం గ్రాంటుగా వస్తుంది. అదే ప్రత్యేక హోదా లేకపోతే ఏఐబీపీలో పెట్టినా 25-55 శాతం లోపే గ్రాంటు వస్తుంది. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే.
  • రాష్ట్రానికి జరిగే ఇంకో మేలు.. మెట్రో రైళ్లు కట్టిస్తామన్నారు. ఉజ్జాయింపుగా ఈ ప్రాజెక్టులకు 15 వేల కోట్లు అవుతుందని లెక్క వేసుకున్నారు. ఇవి తేవడానికి జపాన్, సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి డబ్బులు తెచ్చుకునే కార్యక్రమం చేస్తున్నారు. అలా చేస్తే ఆ డబ్బులు ఎలాగూ ఈ ప్రాజెక్టులు మన చట్టంలో ఉన్నాయి కాబట్టి ఆ డబ్బు విదేశాల నుంచి తెచ్చుకున్నా కేంద్రం మనకు ఇస్తుంది. ప్రత్యేక హోదా ఉంటే ఆ డబ్బును కేంద్రమే కడుతుంది, వడ్డీలు కూడా కట్టక్కర్లేదు
  • అదే హోదా లేకపోతే.. విదేశాల నుంచి తెచ్చే డబ్బులు, వడ్డీ కూడా మనమే కట్టాల్సి వస్తుంది.
  • ఇవన్నీ చంద్రబాబుకు తెలియనిది కాదు.. అయినా అలాగే మాట్లాడతారు
  • ఇక రెండోది.. మనందరికీ సంబంధించిన మేలు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలైతే మాత్రమే పరిశ్రమలకు రాయితీలు భారీగా వస్తాయి. మన రాష్ట్రంలో ఎవరైనా పరిశ్రమ పెడితే, ప్రత్యేక హోదా ఉంటే వాటికి 100 శాతం ఆదాయపన్ను, ఎక్సైజ్ డ్యూటీ, రవాణా ఖర్చులు అన్నీ మినహాయింపు ఉంటాయి. కరెంటు సగం ధరకే 20 ఏళ్ల పాటు లభ్యమవుతుంది
  • ఇలాంటి భారీ ప్రోత్సాహకాలుంటే పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తారు. పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా వస్తారు
  • 972 కిలోమీటర్ల సముద్ర తీరం మనకుంది. లక్షల కోట్ల పెట్టుబడులతో పిల్లలకు లక్షల ఉద్యోగాలు వస్తాయి
  • ఇలాంటి ప్రోత్సాహకాలు కేవలం ప్రత్యేక హోదా ఉంటేనే వస్తాయి.
  • అప్పుడు ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుందన్నది మనం మర్చిపోకూడదు.
  • చంద్రబాబు ఉద్యోగాలు ఇవ్వరు, నిరుద్యోగ భృతి ఇవ్వరు.
  • కేంద్రంతో పోరాడి ప్రత్యేక హోదా తెస్తే.. పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలు వస్తాయంటే అదీ చేయరు
  • ప్రత్యేక హోదా వస్తే నో వేకెన్సీ బోర్డులు ఎక్కడా కనిపించవు.. వాంటెడ్ అనే బోర్డులు కనిపిస్తాయి. అప్పుడు మనమే కంపెనీలను ఎంచుకోవచ్చు
  • చంద్రబాబు ఇవన్నీ పట్టించుకోరు.. ఇంత మంచి జరుగుతుంటే చంద్రబాబు ఎందుకు పోరాటం చేయరని ఒక్కోసారి అనిపిస్తుంది
  • ఎందుకో తెలుసా.. ఈమధ్య కాలంలో మనమంతా టీవీలలో చూశాం.
  • చంద్రబాబు నాయుడు ఆంధ్ర రాష్ట్రంలో లంచాలు తీసుకుని  ఆ లంచాల ద్వారా తీసుకున్న డబ్బులతో పట్టిసీమ దగ్గర్నుంచి పోలవరం దాకా లంచాలే. బొగ్గు నుంచి ఇసుక, మట్టి వరకు అన్నీ లంచాలే. చివరకు మద్యాన్ని తగ్గిస్తామని.. దాన్ని పెంచేందుకు లైసెన్సుల కోసం కూడా లంచాలే
  • ఈ లంచాల డబ్బును ఏం చేయాలోతెలియక పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో ఎమ్మెల్యేకు 5 నుంచి 20 కోట్ల వరకు వెచ్చించి కొనడానికి ప్రయత్నించి అడ్డంగా వీడియో, ఆడియోలలో దొరికిపోయారు
  • ఆ టేపులు వింటే మనకంతా వినిపిస్తుంది.. 'మనోళ్లు దే బ్రీఫ్ డ్ మీ ' అని వినిపిస్తుంది. ఆ మాటలు విని ఎంత గొప్ప ఇంగ్లీషు మాట్లాడాడో మన ముఖ్యమంత్రి అని అంతా అన్నారు
  • ఆ కేసు నుంచి తప్పించుకోడానికి కేంద్రం దగ్గర మొరపెట్టుకుని.. ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రంతో లాలూచీ పడ్డారు.
  • చంద్రబాబు తనమీద కేసులు రాకూడదని దిగజారిపోయారు
  • ఆయనకు కూడా ఇది అర్థం కావాలి. కేసులు పెట్టడం కాదు.. ప్రతిపక్షంలో ఎవరుంటే వాళ్లమీద కేసులు పెడతారు. నామీద కూడా కేసులు పెట్టారు
  • అధికారంలో ఉన్న సోనియాతో కుమ్మక్కై, కిరణ్ ప్రభుత్వాన్ని రక్షించి ఇద్దరూ ఒకటై నామీద కేసులు పెట్టారు.
  • అప్పుడు రాజశేఖరరెడ్డి బతికున్నంత వరకు జగన్ మంచోడే, రాజశేఖరరెడ్డి మంచోడే
  • జగన్ కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టగానే రాజశేఖరరెడ్డి మంచోడు కాకుండా పోయాడు
  • రాజకీయంగా నన్ను అణగదొక్కేందుకు ఈ చంద్రబాబు చీకటిలో చిదంబరాన్ని కలిసి నామీద కేసులు పెట్టారు
  • అయినా నేను భయపడలేదు.. రాష్ట్రాన్ని విడగొట్టొద్దని గట్టిగా నిలబడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడుతున్నా
  • ఆరోజు నేను భయపడలేదు. కారణం ఏమిటంటే.. వాళ్లు కేసులు పెట్టగలరు గానీ, తలరాతలు రాసేది పైనున్న దేవుడని ఎవరూ మర్చిపోకూడదు
  • చంద్రబాబు పైనున్న దేవుడిని నమ్ముకోకుండా... ప్రధాని కాళ్లు పట్టుకుంటున్నారు
  • హోదా ఇవ్వకపోగా దానిమీద అనేక అబద్ధాలు చెబుతున్నారు
  • తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు
  • రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిసా లేవా.. అని అడుగుతున్నా
  • ఆరోజు ఆరాష్ట్రాలన్నీ ఉండగానే మన రాష్ట్రాన్ని విడగొట్టి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు
  • ఇప్పుడెందుకు ప్లేటు మారుస్తున్నారు
  • 14వ ఆర్థిక సంఘం ఒప్పుకోవడం లేదని ఇప్పుడు చెబుతున్నారు
  • అసలు ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా అనే అంశం 14వ ఆర్థిక సంఘం పరిధిలో లేదు
  • దేశం మొత్తంమీద వసూలైన పన్నుల మొత్తాన్ని రాష్ట్రాల మధ్య ఎలా పంచాలో మాత్రమే ఆర్థిక సంఘం చూస్తుంది
  • అది కాక.. నాన్ ప్లాన్ గ్రాంటులు, రుణాల విషయం మాట్లాడుతుంది
  • ప్రత్యేక హోదా అంశం నేషనల్ డెవలప్ మెంట్ కౌన్సిల్, ప్లానింగ్ కమిషన్, నీతి ఆయోగ్, కేంద్ర మంత్రివర్గం పరిధిలోనిది. వీటన్నింటికీ ప్రధానమంత్రే అధ్యక్షుడు.
  • అలాంటి ప్రధానమంత్రి నిర్ణయం తీసుకుంటే ఎందుకు హోదా రాదని అడుగుతున్నాను
  • ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఇచ్చేటప్పుడు వాజ్ పేయి ఒక్క సంతకంతో రాష్ట్రం ఇచ్చేశారు.
  • తర్వాత ప్లానింగ్ కమిషన్ కు పంపారు.
  • 2014 మార్చి 2న అప్పటి ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ కలిసి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్లానింగ్ కమిషన్ కు ఉత్తర్వులు కూడా జారీ చేశారు..
  • ఇప్పటికి ఆ ఉత్తర్వులు ఇచ్చి 19 నెలలు అయిపోయింది. ఇంతవరకు పట్టించుకున్న పాపాన పోలేదు
  • డిసెంబర్ లో మోదీ గారు ప్లానింగ్ కమిషన్ ను రద్దు చేశారు. అంటే ప్రధాని అయిన తర్వాత కూడా 7 నెలలు ఆ ఫైలు పెండింగులో పడి ఉంది
  • కేంద్ర కేబినెట్ నిర్ణయమని తెలిసి కూడా ప్రజలను ఎందుకు మభ్య పెడుతున్నావని చంద్రబాబును నిలదీస్తున్నా
  • అడగాల్సింది మనం... ఇవ్వాల్సింది వాళ్లు. మనం ఏం చేయాలంటే చంద్రబాబు మీద ఒత్తిడి తేవాలి
  • కేంద్రంలో ఉన్న తన మంత్రులను ఉపసంహరించుకుంటానని చంద్రబాబు అల్టిమేటం ఇస్తే ఆరోజు ప్రత్యేక హోదా తప్పకుండా వస్తుందని చెబుతున్నా.
  • ఆ మాట చెప్పిన 24 గంటల్లో తాను జైలుకు పోతానేమోనని ఈయన భయపడుతున్నాడు
  • కానీ మనం ఈ పోరాటం ఆపకూడదు
  • ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు జరిగే మేలేంటో చూద్దాం
  • హిమాచల్ ప్రదేశ్ చూసుకుంటే.. ప్రత్యేక హోదా వల్ల 30వేల కోట్ల పెట్టుబడులు వచ్చి 130 శాతం అధికంగా పరిశ్రమలు, 490 శాతం అధికంగా ఉపాధి అవకాశాలు పెరిగాయి.
  • ప్రత్యేక హోదా వస్తేనే మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయి. అందుకోసం ఎంతవరకైనా పోరాడేందుకు నేను సిద్ధం
  • చంద్రబాబు పాలన మోసం, మోసం, మోసం, వెన్నుపోటు. అంతే!
  • ఎన్నికలకు ముందు బేషరతుగా రైతు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పాడా లేదా?
  • మీ రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
  • మోసం చేశాడు.. డ్వాక్రా రుణాలన్నీ పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పాడా లేదా?
  • డ్వాక్రా రుణాలన్నీ మాఫీ అయ్యాయా?
  • మోసం.. బాబు వస్తేనే జాబు వస్తుందని చెప్పాడా లేదా?
  • మరి జాబు వచ్చిందా..? పోనీ 2 వేల నిరుద్యోగ భృతి వచ్చిందా?
  • ఏవీ రాలేదు. చివరకు పింఛన్లు కూడా కొంతమందికి ఇస్తారు, ఎక్కువ మందికి ఎగ్గొడతారు
  • ఇళ్లు కట్టించడం కాదుకదా, కట్టిన వాటికి బిల్లులు కూడా ఇవ్వడంలేదు.
  • ఈ పాలనకు చరమగీతం పలికే రోజులు రావాలి. ఈ పాలన బంగాళాఖాతంలో కలిసే రోజు వస్తుంది
  • మనమంతా కలిసి కట్టుగా పోరాడదాం. చంద్రబాబే కాదు.. ఆయన నాయన మనసు కూడా మారుతుంది
  • ఈయన అల్టిమేటం ఇస్తారు, కేంద్రం కూడా దిగివస్తుందని చెబుతున్నా
  • మీరంతా ఇక్కడికొచ్చి సంఘీభావం చెబుతున్నందుకు పేరుపేరునా హృదయపూర్వంగా నమస్కారాలు.

Tuesday, 6 October 2015

టీఆర్‌ఎస్, ఎంఐఎంల పొత్తు కోసమే అసెంబ్లీ సమావేశాలు : లక్ష్మణ్

టీఆర్‌ఎస్, ఎంఐఎంల పొత్తు కోసమే అసెంబ్లీ సమావేశాలు : లక్ష్మణ్
Updated :06-10-2015 15:45:49
 హైదరాబాద్ : టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల మధ్య పొత్తు కోసమే ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నట్లుగా ఉందని భారతీయ జనతాపార్టీ శాసనసభాపక్ష నేత కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రాజ్యాంగ సంక్షోభాన్ని నివారించేందుకే ఆరునెలలకోసారి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయే తప్ప సమస్యలకు పరిష్కారం మాత్రం లభించడం లేదరన్నారు. అలాగే రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తే ఆదుకునేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, అయినా... ఆదిశగా ప్రభుత్వం కృషిచేయడం లేదన్నారు.

రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం

రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం 
Updated :06-10-2015 10:46:58
హైదరాబాద్‌, అక్టోబరు 6 : ఏపీ రాజధాని శంకుస్థాపన మహోత్సవంపై వివాదం రాజుకుంది. ప్రభుత్వం నిర్ణయించిన ముహూర్తం సరైంది కాదని సంస్కృత లెక్చరర్‌ పీహెచ్‌హెచ్‌ఈ పురుషోత్తం చెప్పారు. ఈ నెల 22న మకర లగ్నంలో 12.35 నుంచి 12.45 గంటల మధ్య చేస్తే రాజధాని నిర్మాణానికి, చంద్రబాబుకు ఆటంకాలు ఎదురవుతాయన్నారు. ధనుర్‌ లగ్నంలో ఉదయం 11.32 గంటల ముహూర్తం కొంతమేలుగా ఉంది.

Friday, 2 October 2015

పరవాడ హిందూజా పవర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత

పరవాడ హిందూజా పవర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత
Updated :03-10-2015 11:25:08
విశాఖపట్నం, అక్టోబర్ 3 : జిల్లాలోని పరవాడ హిందూజా వపర్‌ప్లాంట్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్లాంట్ వద్ద ధర్నాకు యత్నించిన వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హిందూజా పవర్‌ప్లాంట్ నిర్వాసితులు, స్థానిక గ్రామస్తుల సమస్యల పరష్కారం కోసం వైసీపీ ధర్నాకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో అప్పికొండ దగ్గర బారికేడ్లను ఏర్పాటు చేసి భారీగా పోలీసులు మోహరించారు. వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వైసీపీ నేతలను, వారి వాహనాలను పూర్తిస్థాయిలో అడ్డుకున్నారు. దీంతో పోలీసులతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పెద్దఎత్తున వైసీపీ నేతలు అక్కడకు చేరుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.