| ఈనెల 8 నుంచి నవ్యాంధ్ర రాజధాని భూ సమీకరణ ఒక వేళ రైతులు అంగీకరించకపోతే వేరేచోటుకి.. - ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మంత్రి పత్తిపాటి పుల్లారావు | |
విజయవాడ, నవంబర్ 6 : ఈ నెల 8వ తేదీ నుంచి నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని భూ సేకరణ ప్రక్రియ ప్రాంభం అవుతుందని భూ సమీకరణ సభ్యుడు, ఏపీ వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. రైతులను ఒప్పించి భూ సమీకరణ చేస్తామని, భూమిని గ్రేడ్ల వారిగా విభజించి రైతులకు పరిహారం అందిస్తామని ఆయన అన్నారు. 8వ తేదీని భూ సేకరణ కమిటీ గ్రామాల వారీగా రైతులతో సమావేశం అవుతుందని మంత్రి చెప్పారు. రైతులతో తమ సమావేశాలు ముగిసిన తర్వాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయా గ్రామాలకు వస్తారని మంత్రి తెలిపారు.
నవ్యాంధ్ర రాజధానిపై సందేహాలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు రాజధానిగా గుంటూరు జిల్లా తుళ్లూరు, మంగళగిరి మండలంలో ఉన్న మొత్తం 18 గ్రామాలను ఎంపిక చేసింది. అయితే ఈ గ్రామాల రైతులకు భూ సమీకరణ కింద భూమి ఇవ్వాల్సిన రైతులకు-ప్రభుత్వానికి మధ్య కొంత సమయం (గ్యాప్) రావడంతో గ్యాప్ ఎందుకు వచ్చిందని గత మూడు రోజుల నుంచి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బృందం ఆ గ్రామాల్లో పర్యటిస్తే విసదమవుతుందని.. మరోవైపు మెట్ట భూమిని ఇస్తామన్న రైతుల న్యాయమైన డిమాండ్ను ప్రభుత్వం పరిష్కరించడంలేదని ఆందోళన వారిలో కనిపిస్తుంది. ప్రభుత్వం నుంచి వస్తున్న ప్రకటనలు కూడా రైతుల్లో గందరగోళం నెలకొంది... తుళ్లూరులో 5 గ్రామాల్లో రైతులు తమ భూములకు ప్రత్యేక ప్యాకేజీ కావాలని, దానికి సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వని పక్షంలో భూములు ఇచ్చేది లేదని వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో రాజధానిపై ఏబీఎన్ కూడా కథనాలు ప్రసారం చేసింది.
ఈ సందర్భంగా గురువారం మంత్రి పత్తిపాటి పుల్లారావు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎక్స్క్లూసివ్గా మాట్లాడుతూ... భూ సేకరణకు సంబంధించి ఇంతవరకు గ్రామాల్లో ఏ రైతులతోనూ మాట్లాడలేదని చెప్పారు. దీనిపై ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని, రైతుల డిమాండ్లు ఏమిటన్నదానిపై ఒకటికి రెండు సార్లు రైతులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గురువారం నుంచి మూడు రోజుల పాటు గ్రామాల్లో పర్యటించి రైతుల ఆలోచనలు తెలుసుకుంటామని, 8వ తేదీ సాయంత్రం కేబినెట్ సబ్ కమిటీ రైతులతో సమావేశం జరిగే విధంగా ఏర్పాటు చేయాలని కమిటీ సభ్యుడు శ్రావణ్కుమార్ను కోరామని పత్తిపాటి తెలిపారు.
రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి అనేక ఒత్తిడులు ఉన్నా అన్ని విధాటా బాగుంటుందన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు తుళ్లూరు వద్ద రాజధాని ఎంపిక చేయడం జరిగిందని మంత్రి తెలిపారు.ప్రతిపక్షాలు కావాలని రాజధానిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆ విషయం రైతులు, ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారని మంత్రి పేర్కొన్నారు. రైతులను అన్ని విధాల సంతృప్తి పరుస్తామని ఆయన అన్నారు. దేశంలో నెంబర్ వన్ రాజధానిగా చేయాలని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారని ఆ విధంగా ముందుకు వెళతామని మంత్రి తెలిపారు.
భూములు ఇస్తామన్న 10 గ్రామాల్లో తొలి దశలో 20 వేల ఎకరాల భూ సేకరణ జరుపుతామని, ఒక వేళ రైతులు అంగీకరించకపోతే రాజధాని వేరేచోటుకు వెళుతుందని, అందుకు ప్రభుత్వం వద్ద ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు ఉన్నాయని మంత్రి తెలిపారు. భూ సేకరణ కమిటీలో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఉన్నారని ఆయన తెలిపారు. చంద్రబాబు నాయుడు కూడా గురువారం తనతో మాట్లాడారని, రైతుల డిమాండ్లు పరిశీలించాలని ఆదేశించినట్లు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. భూ సేకరణను నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. |
Disclaimer : None of the Posts in this blog are mine. They were collected only for the reference purpose from various websites. Viewers may visit source websites for further study.

No comments:
Post a Comment